Baby girl: 'పాపా'నికి ఒడిగట్టారు... మురికి కాలువలో శిశువు మృతదేహం..!

  • జనగామ జిల్లాలో ఘటన
  • పాప మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • పాప చేతికి ఉన్న ట్యాగ్‌పై నవనీత, నర్సింహులు అనే పేర్లు

మగపిల్లల క‌న్నా ఆడ‌పిల్ల‌లే న‌య‌మ‌ని ఎన్నో సంఘ‌ట‌న‌లు నిరూపిస్తోన్న ఈ కాలంలోనూ ఆడ‌పిల్ల‌ల‌పై వివ‌క్ష ఇంకా చాలా చోట్ల కొన‌సాగుతోంది. ఆడ‌పిల్ల పుట్టిందంటేనే కొంద‌రు త‌ల్లిదండ్రులు శాపంగా భావిస్తున్నారు. పురిట్లోనే వాళ్లను చిదిమేస్తూ ఆట‌వికంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇటువంటి ఘ‌ట‌నే జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ పసిపాపను కాలువ‌లో ప‌డేసి వెళ్లిపోయారు. మురికికాలువ‌లో ఆ శిశువు మృతదేహం ఉన్న‌ట్లు స‌మాచారం అందుకున్న పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ఆ పాప చేతికి ఉన్న ట్యాగ్‌పై నవనీత, నర్సింహులు అనే పేర్లు ఉన్నట్లు గుర్తించారు. 

More Telugu News