సమసిపోయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వివాదం!
- నెలకొన్న సమస్యలు పరిష్కారం: అటార్నీ జనరల్, బీసీఐ ఛైర్మన్
- 15 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో భేటీ అయ్యాం
- సదరు న్యాయమూర్తులు విధులకు హాజరవుతున్నారు
- రాజకీయ పార్టీలు లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నాయి
సుమారు 15 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో తాము భేటీ అయ్యామని మనన్ మిశ్రా చెప్పారు. ఈ సమస్యను ఎత్తి చూపుతూ రాజకీయ పార్టీలు లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సమస్యలు ఉన్నాయంటూ మీడియా ముందుకు వచ్చిన సదరు నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ప్రస్తుతం యథావిధిగా కోర్టుకు వెళ్లి విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. వారందరూ చాలా నిజాయతీ గలవారని తెలిపారు.