disha patani: 'సంఘమిత్ర' ప్రాజెక్టు ఒక కొలిక్కి వచ్చినట్టే!

  • సుందర్ సి. దర్శకత్వంలో 'సంఘమిత్ర'
  • టైటిల్ రోల్ లో 'దిశా పఠాని'
  • ఏప్రిల్ లేదా మే నుంచి సెట్స్ పైకి         

శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ వారు 'సంఘమిత్ర' టైటిల్ తో .. సుందర్.సి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనుకున్నారు. 450 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నట్టు చెప్పారు. ఈ సినిమాలో టైటిల్ రోల్ కోసం శ్రుతిహాసన్ ను ఎంపిక చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది. ఆ తరువాత కొంతమంది కథానాయికల పేర్లు వినిపించాయి కానీ, ఎవరూ ఖరారు కాలేదు.

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమా వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని సమాచారం. టైటిల్ రోల్ కోసం తీసుకోవాలనే ఉద్దేశంతో 'దిశా పఠాని'తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఆమె ఎంపిక దాదాపు ఖరారైనట్టేనని అంటున్నారు. ఏప్రిల్ .. మే నెలలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నట్టు చెబుతున్నారు.       

More Telugu News