Nellore: నారా లోకేష్ కాన్వాయ్ లో ప్రమాదం.. అంతా సేఫ్!

  • నెల్లూరు నుంచి తిరుపతి బయలుదేరిన లోకేష్
  • సెక్యూరిటీ వాహనాలు ఢీ
  • తిరుపతి చేరుకున్న లోకేష్

'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమంలో భాగంగా తన నెల్లూరు పర్యటనను ముగించుకుని, ఏపీ మంత్రి నారా లోకేష్ బయలుదేరిన వేళ, ఆయన కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు నుంచి బయలుదేరిన కాన్వాయ్ లో వెనక వస్తున్న సెక్యూరిటీ వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఏర్పేడు మండలం మేర్లపాక దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో రెండు ఎస్కార్ట్ వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాద తీరును పరిశీలించిన అనంతరం లోకేష్ తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన క్షేమంగా తిరుపతి చేరుకున్నారు.

More Telugu News