వంట గ్యాస్పై కేంద్రం శుభవార్త.. ఇక నెలనెలా ధరల పెంపు లేనట్టే!
- ప్రస్తుతం సిలిండర్పై ప్రతినెల రూ.4 పెంపు
- ధరల పెంపుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
- వెనక్కి తగ్గిన ప్రభుత్వం...
- చమురు కంపెనీలకు ఆదేశాలు జారీ
గతేడాది జూలైలో చమురు కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ సిలిండర్పై ప్రతీ నెల రెండు రూపాయలు పెంచాలని పేర్కొంది. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో రూ.2లను ఈ ఏడాది మేలో రూ.4 చేశారు. జూన్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఫలితంగా వచ్చే ఏడాది మార్చి నాటికి వంట గ్యాస్పై అందిస్తున్న సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయవచ్చని ప్రభుత్వం భావించింది.
ప్రస్తుతం అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతుండడం, పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతోంది. దీనికి తోడు గ్యాస్ ధరల పెంపుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇకపై నెలనెలా గ్యాస్ ధరలు పెంచవద్దని చమురు సంస్థలను ఆదేశించింది.