tejaswi yadav: మా నాన్నను రాజకీయంగా సమాధి చేశామనుకోవద్దు: బీజేపీపై తేజస్వి ఫైర్

షార్ట్స్‌లో చూడండి
దాణా కుంభకోణంలో ఆర్జీడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, లాలూ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత ఆయన కుమారుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన మండిపడ్డారు.

లాలూను జైలుకు పంపడం ద్వారా ఆయనను రాజకీయ సమాధి చేశామని వైరి పక్షాలు భావిస్తే... అది వారి మూర్ఖత్వమే అవుతుందని అన్నారు. ఇదే కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా సహా మరి కొందరిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడం పట్ల ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు.

ఒకవేళ బీజేపీతో తన తండ్రి చేతులు కలిపి ఉంటే... వారికి ఆయన సత్య హరిశ్చంద్రుడిలా కనిపించేవారని తేజస్వి అన్నారు. సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. హైకోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని అన్నారు. 
Go Back to Shorts
tejaswi yadav
lalu prasad yadav
fodder scam

More Telugu News