చంద్రబాబుకు జన్మంతా రుణపడి ఉంటాం.. ముద్రగడ చేసిందేమీ లేదు: తిరుపతి కాపు నేతలు
- 50 ఏళ్ల కలను చంద్రబాబు నిజం చేశారు
- ఇచ్చిన హామీని నెరవేర్చారు
- కాపుల కోసం ముద్రగడ చేసిందేమీ లేదు
కాపులను బీసీలో చేర్చిన చంద్రబాబుకు తాము జన్మంతా రుణపడి ఉంటామని తిరుపతి కాపు నేతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ప్రకటించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. రిజర్వేషన్లు లేక గత 50 ఏళ్లుగా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాయని... చంద్రబాబు చొరవతో తమ సమస్యలు నేటితో తొలగిపోయాయని చెప్పారు. కాపు నేతనని చెప్పుకుంటున్న ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల కోసం ఒక్కసారి కూడా చంద్రబాబును కలవలేదని... వైసీపీ కూడా దీనిపై అనవసర రాద్ధాంతం చేసిందని మండిపడ్డారు.