డిసెంబరు 8న రాహుల్ పట్టాభిషేకం.. వడివడిగా ఏర్పాట్లు!
- గుజరాత్, హిమాచల్ప్రదేశ్ ఫలితాల విడుదలకు ముందే పగ్గాలు
- ముహూర్తం ఖారారు చేసిన అధిష్ఠానం
- నేడు పార్టీ అంతర్గత ఎన్నికల షెడ్యూలు ఖరారు
గుజరాత్ ఎన్నికల తొలి విడత పోలింగ్ డిసెంబరు 9న, రెండో విడత 14న జరగనుండగా 18న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. కాబట్టి ఈలోపే రాహుల్కు పగ్గాలు అప్పగించాలని అధిష్ఠానం భావిస్తోంది. ప్రస్తుతం రాహుల్ క్రేజ్ పీక్ స్టేజిలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడే పని కానిచ్చేస్తే పోతుందని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, రాహుల్ కనుక పార్టీ పగ్గాలు స్వీకరిస్తే నెహ్రూ కుటుంబం నుంచి ఈ పదవి చేపట్టిన ఐదో వ్యక్తి అవుతారు.