krishna river: విజయవాడ పడవ ప్రమాదంపై కేటీఆర్ దిగ్భ్రాంతి!

  • కృష్ణా నది పడవ ప్రమాదంపై స్పందించిన కేటీఆర్
  • ప్రమాదం గురించి తెలియగానే షాక్ కు గురయ్యా
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద పడవ బోల్తా ప్రమాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలియగానే షాక్ కు గురయ్యానని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. కాగా, నిన్న సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందగా, మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. 
krishna river
KTR
boat accident

More Telugu News