akash puri: 'మెహబూబా' తాజా షెడ్యూల్ పంజాబ్ లో!

  • ఆకాశ్ పూరి .. నేహా శెట్టి జంటగా 'మెహబూబా' 
  • హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ పూర్తి 
  • పంజాబ్ కి చేరుకున్న టీమ్ 
  • ఆ తరువాత షూటింగ్ రాజస్థాన్ లో  

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ తో 'మెహబూబా' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 1971లో జరిగిన ఇండో - పాక్ యుద్ధం నేపథ్యంలో జరిగిన ఓ ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. ఆకాశ్ జోడీగా నేహా శెట్టి నటిస్తోన్న ఈ సినిమా, కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు.

 అక్కడి షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా పంజాబ్ చేరుకుని, రెండవ షెడ్యూల్ ను ఈ రోజు నుంచి మొదలుపెట్టింది. పంజాబ్ లోని ఇండో - పాక్ బోర్డర్ లో కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత ఈ సినిమా టీమ్ రాజస్థాన్ వెళ్లనుంది. అక్కడ కూడా కొన్ని సీన్స్ ను .. సాంగ్స్ ను చిత్రీకరించనున్నారు. తెలుగులో చాలా గ్యాప్ తరువాత సందీప్ చౌతా ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే.      

More Telugu News