నటుడిగా తెరంగేట్రం చేయనున్న భారతీయ ఆస్కార్ విజేత
- 'ఒరు కథై సొల్లట్టుమా' చిత్రంలో నటించనున్న రసూల్ పూకుట్టి
- సౌండ్ ఇంజినీర్ పాత్రను పోషించనున్న సౌండ్ ఇంజినీర్
- తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల
ప్రసాద్ ప్రభాకరన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల పాటు జరిగే త్రిస్సూర్ పూరం పండగకు కొన్ని లక్షల మంది హాజరవుతారు. అక్కడ వినిపించే సంప్రదాయ సంగీతాన్ని రికార్డు చేయాలనేది రసూల్ పూకుట్టి నిజజీవిత లక్ష్యం కూడా. ఈ సినిమా కోసం హాలీవుడ్, బాలీవుడ్కి చెందిన 80 మంది సౌండ్ టెక్నీషియన్లు కష్టపడి త్రిస్సూర్ పూరం పండగ శబ్దాలను రికార్డు చేయనున్నారని దర్శకుడు ప్రభాకరన్ తెలిపారు.