హరీశ్రావుపై భారీ పంచ్ వేసి.. అసెంబ్లీలో నవ్వులు పూయించిన జానారెడ్డి!
- రైతులపై కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది: హరీశ్రావు
- రైతుల గురించి చర్చించేటప్పుడు కాంగ్రెస్ నేతలు సభలో లేరు
- రైతుల గురించి చర్చించేటప్పుడు సీఎం కేసీఆర్ కూడా లేరు: జానారెడ్డి
- రైతులపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది
అయితే, వెంటనే హరీశ్రావుకి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు జానారెడ్డి కౌంటర్ ఇచ్చారు. 'ఇప్పుడే హరీశ్ రావు ఒక విషయం చెప్పారు.. సభలో ప్రతి సభ్యుడు చెప్పిన విషయాన్ని మేము శ్రద్ధగా వింటున్నాం.. సభలో ఇంతటి ముఖ్యమైన విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు సీఎం కేసీఆర్ లేరు. రైతులపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది' అని ఎద్దేవా చేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీల సభ్యులంతా నవ్వేశారు.
కాగా, రైతు రుణమాఫీ, కనీస మద్దతు ధరపై కేసీఆర్ సర్కారు తీరు బాగోలేదని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహ్యతకు పాల్పడుతున్నారని చెప్పారు. నకిలీ విత్తనాల విక్రయదారులపై ఏ చర్యలు తీసుకున్నారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సభలో నిలదీశారు.