cow: గోవుల‌తో తొక్కించుకుంటోన్న యువ‌కులు.. మీరూ చూడండి!

  • మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జయిని పట్టణ పరిసర ప్రాంతాల్లో ఆచారం
  • వందల సంఖ్యలో గోవులు
  • సుదూర ప్రాంతాల నుంచి త‌ర‌లివ‌చ్చి కార్య‌క్ర‌మంలో పాల్గొంటోన్న భ‌క్తులు
  • భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని న‌మ్మ‌కం

భార‌త్‌లో హిందువులు ఆవును గోమాత‌గా పూజిస్తార‌న్న విష‌యం తెలిసిందే. ఆవును పూజిస్తే స‌క‌ల దేవ‌తారాధ‌న చేసిన‌ట్లేన‌ని భావిస్తారు. అయితే, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జయిని పట్టణ పరిసర ప్రాంతాల్లో యువ‌కులు గోవుల‌తో తొక్కించుకుంటున్నారు. వందల సంఖ్యలో గోవులు ఆ యువ‌కుల మీదుగా వెళ్లగా, ఆ యువ‌కుల్లో కొందరికి తీవ్రగాయాలయ్యాయి. ఇలా చేస్తే త‌మ‌కు మంచి జ‌రుగుతుంద‌ని వారు భావిస్తున్నారు.
 
ఈ ఆచారం కొత్త‌గా పుట్టుకొచ్చింది కాదు. గత 100 ఏళ్లుగా దీన్ని పాటిస్తున్నారు. ప్ర‌తి ఏడాది దీపావళి తర్వాత వచ్చే ఏకాదశి రోజున నిర్వ‌హిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఉజ్జయినికి తరలి వ‌చ్చి, గోవులకు రంగులు, దండలు వేసి వాటితో తొక్కించుకుంటున్నారు. 

More Telugu News