payyavula kesav: కవితతో కలిసి కంపెనీ రిజిస్టర్ చేయించిన రేవంత్ రెడ్డి: పయ్యావుల కేశవ్

  • జగన్ తో రేవంత్ కు సంబంధాలు
  • కవితతో కలసి వ్యాపారాలు
  • కేసీఆర్ ను కలిస్తే తప్పా?

కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితతో వ్యాపారం కోసం రేవంత్ రెడ్డి కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ తో కూడా రేవంత్ కు సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తాను కేవలం మర్యాదపూర్వకంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశానని... ఈ అంశాన్ని అనవసరంగా రాద్ధాంతం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

More Telugu News