రాష్ట్రపతి భద్రత కోసం నాలుగేళ్లలో రూ. 155 కోట్లు ఖర్చు!
- అత్యధికంగా 2016-17లో ఖర్చు
- వాహనాల నిర్వహణ కోసం రూ. 64.9 లక్షలు
- ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన రాష్ట్రపతి భవన్
అంతేకాకుండా ఈ నాలుగేళ్లలో భద్రతా సిబ్బంది ఉపయోగించే వాహనాల నిర్వహణ కోసం రూ.64.9 లక్షలు ఖర్చు పెట్టారు. ఇందులో 2014-15లో రూ.15.5 లక్షలు, 2015-16లో రూ.20 లక్షలు, 2016-17లో రూ.21.8 లక్షలు, 2017-18లో ఇప్పటి వరకు రూ.7.5 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. ఈ వ్యయంలో ఇంధన ఖర్చును మినహాయించారు. అందుకు కారణం... ప్రభుత్వ పెట్రోల్ బంకుల నుంచే ఇంధనాన్ని ఉపయోగించామని పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా భద్రతా సిబ్బంది ఎంత మంది ఉంటారు? ఎన్ని వాహనాలు ఉపయోగిస్తారు? అనే విషయాలను రాష్ట్రపతి భవన్ వెల్లడించలేదు.