ఉదయం నుంచి వైజాగ్ ను ముంచెత్తిన వాన
- బంగాళా ఖాతంలో వాయుగుండం
- ఉదయం నుంచి విశాఖ జిల్లాను ముంచెత్తిన వర్షం
- పూరీకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం
తుపాను నేపథ్యంలో తీరప్రాంతం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పూరీకి 370 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీని కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వారు చెప్పారు. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విశాఖ వాసుల దీపావళి శోభ హరించుకుపోయింది.