haripriya: బాలయ్య సరసన 'పిల్ల జమీందార్' హీరోయిన్!

  • షూటింగ్ దశలో బాలకృష్ణ మూవీ 
  • కథానాయికలుగా నయనతార .. నటాషా దోషి
  • మరో హీరోయిన్ కోసం జరుగుతోన్న అన్వేషణకు ఫుల్ స్టాప్

బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ముగ్గురు కథానాయికలు కనిపించనున్నారు. ఒక కథానాయికగా నయనతారను .. మరో కథానాయికగా నటాషా దోషిని ఎంపిక చేసుకున్నారు. మూడవ కథానాయిక పాత్ర కోసం రెజీనాను తీసుకున్నారనే టాక్ వచ్చింది. కానీ ఆ పాత్రకు 'పిల్ల జమీందార్' హీరోయిన్ ను ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం.

 గతంలో నాని హీరోగా వచ్చిన 'పిల్ల జమీందార్' సినిమాలో హరిప్రియ కథానాయికగా నటించింది. ఆ సినిమా హిట్ కొట్టినా ఆమె కెరియర్లో పెద్దగా మార్పులేం జరగలేదు. దాంతో ఈ అమ్మాయి కన్నడ సినిమాలపై దృష్టి పెట్టి .. అక్కడ నెట్టుకొస్తోంది. అలాంటి హరిప్రియను బాలకృష్ణ తాజా చిత్రం కోసం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఈ సినిమా యూనిట్ కూడా ధ్రువీకరించింది. మరి ఈ సినిమా అయినా ఈ సుందరికి కలిసొస్తుందేమో చూడాలి.     

More Telugu News