varun tej: మెగా హీరో మాంచి స్పీడ్ మీదే వున్నాడు

'మిస్టర్' సినిమా పరాజయంతో డీలాపడిన వరుణ్ తేజ్ కి, 'ఫిదా' సినిమా భారీ విజయాన్ని అందించింది. నటనలో మంచి పరిణతి చూపించాడంటూ ఆయనకి ప్రశంసలు లభించాయి. ఈ ఉత్సాహంతో ఆయన తన తదుపరి సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో వున్నాడు.

 వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన తదుపరి చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుని రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. జూలై నెలాఖరులోనే మొదటి షెడ్యూల్ ను ఆరంభించి, పోరాట సన్నివేశాలను తెరకెక్కించారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాశిఖన్నా కథానాయికగా నటిస్తోంది. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా, తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని వరుణ్ తేజ్ భావిస్తున్నాడు.       

More Telugu News