చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు

చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు

శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ .. ఆయన సేవలో తరించిన భక్తులలో ఒకరిగా నిమాయి కనిపిస్తాడు. నిమాయి అసలు పేరు గౌరాంగదేవుడు. పండిత జగన్నాథ మిశ్రా .. శచీదేవి దంపతులకు ఆయన జన్మించాడు. ఆ దంపతులు ఆయనకి పెట్టుకున్న ముద్దు పేరే నిమాయి. ఒకసారి ఆయన 'గయ'కు వెళ్లినపుడు శ్రీమన్నారాయణుడి చరణ చిహ్నాలను చూడగానే ఆయన బాహ్య స్మృతిని కోల్పోయాడు.

ఆ సమయంలో ఆయన చెంతనే వుండి, ఆయన తిరిగి ఈ లోకంలోకి రావడానికి ప్రయత్నించిన మహనీయుడే ఈశ్వరపురి. భగవంతుడి సాన్నిధ్యం కోసం తహ తహలాడుతున్న గౌరాంగుడుకి దశాక్షర శ్రీ కృష్ణ మంత్రాన్ని ఈశ్వరపురి ఉపదేశించాడు. ఆ క్షణం నుంచి గౌరాంగ దేవుడి జీవితమే మారిపోయింది. ఆయనకి అంతటా కృష్ణ చైతన్యమే గోచరించడం మొదలైంది. కాలక్రమంలో ఆయనే చైతన్య ప్రభువుగా మారాడు. ఆయన స్నేహితుడైన నిత్యానందుడు కూడా కృష్ణభక్తి మార్గాన్నే అనుసరించి నితాయిగా ప్రసిద్ధి చెందాడు.

More Bhakti Articles