19 ఏళ్ల కుర్రాడు.. నెలకు రూ.1 కోటి సంపాదన.. ఏఐతో ఏం చేస్తున్నాడు?
- 'ఏఐ' విద్యతో నెలకు కోటి రూపాయలు ఆర్జిస్తున్న 19 ఏళ్ల యువకుడు
- కరోనా కష్టాలతో 13 ఏళ్లకే సొంతంగా ఏఐ నేర్చుకున్న ఆయుష్ సింగ్
- టాప్మేట్ ప్లాట్ఫామ్ ద్వారా తన కోర్సులను విజయవంతంగా విక్రయం
- లింక్డిన్ పోస్టుతో వెలుగులోకి వచ్చిన స్ఫూర్తిదాయక కథ
ఎటువంటి ఉన్నత విద్యాభ్యాసం కానీ, గొప్ప కుటుంబ నేపథ్యం కానీ లేకుండా, కేవలం తన అసాధారణ ప్రతిభతో ఓ 19 ఏళ్ల యువకుడు నెలకు కోటి రూపాయలు ఆదాయాన్ని ఆర్జిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నైపుణ్యాలను బోధించే వ్యాపారం ద్వారా ఆయుష్ సింగ్ సాధిస్తున్న ఈ అద్భుత విజయం ప్రస్తుతం ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. టాప్మేట్ సహ వ్యవస్థాపకుడు దినేష్ సింగ్ తన లింక్డ్ఇన్ ఖాతాలో ఆయుష్ ప్రస్థానం గురించి వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కరోనా మహమ్మారి సమయంలో తన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో, కేవలం 13 ఏళ్ల వయసులోనే ఆయుష్ సింగ్ 'మెషిన్ లెర్నింగ్' నేర్చుకోవడం ప్రారంభించాడు. పాత ఆన్లైన్ కోర్సులు, అంతంతమాత్రంగా పనిచేసే ఇంటర్నెట్, ఒక సాధారణ లాప్టాప్తోనే తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తన పట్టుదలతో కొన్ని నెలల్లోనే అంతర్జాతీయ స్టార్టప్లతో కలిసి పనిచేసే స్థాయికి ఎదిగాడు. 14 ఏళ్లకే అతని పనితీరును ప్రఖ్యాత 'ఎంఐటీ' సైతం ప్రశంసించడం విశేషం. ఆ తదుపరి కాలంలో పలు సంస్థల్లో డేటా సైంటిస్ట్, ఎంఎల్ఆప్స్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, 'యాంటెర్న్', 'సెకండ్ బ్రెయిన్ ల్యాబ్స్' వంటి సంస్థలను కూడా స్థాపించాడు.
దేశంలోని వందలాది మంది ఇంజనీర్లకు 'ఏఐ'లో శిక్షణనిస్తూ వారికి మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించినప్పటికీ, తన నైపుణ్యాల ద్వారా భారీ మొత్తంలో ఆదాయం గడించడం ఆయుష్కు ఆరంభంలో ఒక సవాలుగా మారింది. ఈ తరుణంలో 'టాప్మేట్' అనే ప్లాట్ఫామ్ అతనికి దిశానిర్దేశం చేసింది.
తన కోర్సులను ఒక క్రమపద్ధతిలో ప్యాకేజీలుగా రూపొందించి, సరైన మార్కెటింగ్ వ్యూహాలతో విక్రయించడానికి ఈ వేదిక ఎంతగానో తోడ్పడింది. దీనివల్ల అతని వ్యాపారం ప్రస్తుతం నెలకు సుమారు కోటి రూపాయల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరుకుంది. అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నప్పటికీ, వాటిని వ్యాపార మార్గంలోకి మలుచుకోవడంలో చాలామంది విఫలమవుతున్న నేటి కాలంలో, ఆయుష్ సింగ్ సాధించిన విజయం ఎందరో యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
కరోనా మహమ్మారి సమయంలో తన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో, కేవలం 13 ఏళ్ల వయసులోనే ఆయుష్ సింగ్ 'మెషిన్ లెర్నింగ్' నేర్చుకోవడం ప్రారంభించాడు. పాత ఆన్లైన్ కోర్సులు, అంతంతమాత్రంగా పనిచేసే ఇంటర్నెట్, ఒక సాధారణ లాప్టాప్తోనే తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తన పట్టుదలతో కొన్ని నెలల్లోనే అంతర్జాతీయ స్టార్టప్లతో కలిసి పనిచేసే స్థాయికి ఎదిగాడు. 14 ఏళ్లకే అతని పనితీరును ప్రఖ్యాత 'ఎంఐటీ' సైతం ప్రశంసించడం విశేషం. ఆ తదుపరి కాలంలో పలు సంస్థల్లో డేటా సైంటిస్ట్, ఎంఎల్ఆప్స్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, 'యాంటెర్న్', 'సెకండ్ బ్రెయిన్ ల్యాబ్స్' వంటి సంస్థలను కూడా స్థాపించాడు.
దేశంలోని వందలాది మంది ఇంజనీర్లకు 'ఏఐ'లో శిక్షణనిస్తూ వారికి మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించినప్పటికీ, తన నైపుణ్యాల ద్వారా భారీ మొత్తంలో ఆదాయం గడించడం ఆయుష్కు ఆరంభంలో ఒక సవాలుగా మారింది. ఈ తరుణంలో 'టాప్మేట్' అనే ప్లాట్ఫామ్ అతనికి దిశానిర్దేశం చేసింది.
తన కోర్సులను ఒక క్రమపద్ధతిలో ప్యాకేజీలుగా రూపొందించి, సరైన మార్కెటింగ్ వ్యూహాలతో విక్రయించడానికి ఈ వేదిక ఎంతగానో తోడ్పడింది. దీనివల్ల అతని వ్యాపారం ప్రస్తుతం నెలకు సుమారు కోటి రూపాయల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరుకుంది. అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నప్పటికీ, వాటిని వ్యాపార మార్గంలోకి మలుచుకోవడంలో చాలామంది విఫలమవుతున్న నేటి కాలంలో, ఆయుష్ సింగ్ సాధించిన విజయం ఎందరో యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.