3 రోజుల్లో రూ.52 లక్షల కోట్లు ఆవిరి.. స్పేస్ఎక్స్కు భారీ షాక్
- స్పేస్ఎక్స్ షేర్లు మూడో రోజు కూడా పతనం
- మూడు రోజుల్లో 23 శాతం క్షీణించిన స్టాక్ విలువ
- 600 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరి
- ఏఐ కోసం భారీ రుణ సమీకరణ యత్నం
- 20 బిలియన్ డాలర్ల బాండ్ ఇష్యూకు సిద్ధం
సంచలన ఐపీవోతో మార్కెట్లోకి అడుగుపెట్టిన అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎలాన్ మస్క్కు చెందిన ఈ కంపెనీ షేర్లు వరుసగా మూడో రోజూ పతనమయ్యాయి. దీంతో కేవలం మూడు రోజుల్లోనే కంపెనీ మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లకుపైగా (సుమారు రూ.52 లక్షల కోట్లు) కరిగిపోయింది.
వరుసగా పడిపోయిన షేర్లు
సోమవారం స్పేస్ఎక్స్ షేరు మరో 16 శాతం క్షీణించి 154.60 డాలర్ల వద్ద ముగిసింది. కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత నమోదైన కనిష్ఠ స్థాయి ఇదే. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో షేరు మొత్తం 23 శాతం పడిపోయింది. దీంతో మార్కెట్ విలువ భారీగా తగ్గినా కంపెనీ మొత్తం విలువ ఇంకా 2 ట్రిలియన్ డాలర్లకు పైగానే ఉంది.
బాండ్ల జారీతో ఆందోళన
ఏఐ రంగంలో విస్తరణ కోసం స్పేస్ఎక్స్ భారీ మొత్తంలో నిధులు సమీకరించేందుకు బాండ్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల కంపెనీపై అప్పుల భారం పెరిగే అవకాశం ఉందని, ఏఐ పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇస్తాయా అనే సందేహాలు కూడా ఇన్వెస్టర్లలో వ్యక్తమయ్యాయి. దీంతో షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
విలువ ఇప్పటికే ఎక్కువైందా?
రికార్డు ఐపీవో తర్వాత స్పేస్ఎక్స్ షేర్లపై రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి భారీగా కనిపించింది. తొలి ఐదు రోజుల్లోనే వ్యక్తిగత పెట్టుబడిదారులు 405 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. స్పేస్ఎక్స్ భవిష్యత్ వృద్ధిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండటంతో షేర్ ధర చాలా పెరిగిందని, అందుకే ఇప్పుడు అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వరుసగా పడిపోయిన షేర్లు
సోమవారం స్పేస్ఎక్స్ షేరు మరో 16 శాతం క్షీణించి 154.60 డాలర్ల వద్ద ముగిసింది. కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత నమోదైన కనిష్ఠ స్థాయి ఇదే. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో షేరు మొత్తం 23 శాతం పడిపోయింది. దీంతో మార్కెట్ విలువ భారీగా తగ్గినా కంపెనీ మొత్తం విలువ ఇంకా 2 ట్రిలియన్ డాలర్లకు పైగానే ఉంది.
బాండ్ల జారీతో ఆందోళన
ఏఐ రంగంలో విస్తరణ కోసం స్పేస్ఎక్స్ భారీ మొత్తంలో నిధులు సమీకరించేందుకు బాండ్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల కంపెనీపై అప్పుల భారం పెరిగే అవకాశం ఉందని, ఏఐ పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇస్తాయా అనే సందేహాలు కూడా ఇన్వెస్టర్లలో వ్యక్తమయ్యాయి. దీంతో షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
విలువ ఇప్పటికే ఎక్కువైందా?
రికార్డు ఐపీవో తర్వాత స్పేస్ఎక్స్ షేర్లపై రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి భారీగా కనిపించింది. తొలి ఐదు రోజుల్లోనే వ్యక్తిగత పెట్టుబడిదారులు 405 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. స్పేస్ఎక్స్ భవిష్యత్ వృద్ధిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండటంతో షేర్ ధర చాలా పెరిగిందని, అందుకే ఇప్పుడు అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.