పవన్ కల్యాణ్ కు 'ఓజీ2' కథ చెప్పిన సుజీత్.. ఫ్యాన్స్ కు పూనకాలే!
- పవన్ కళ్యాణ్ 'ఓజీ' సీక్వెల్ (ఓజీ2) పనులు ప్రారంభం
- దర్శకుడు సుజీత్, పవన్ మధ్య చర్చలు
- ఇచ్చిన మాట ప్రకారం ఓజీ యూనివర్స్పై దృష్టి పెట్టిన పవన్
- పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి అధికారిక ప్రకటన
- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సంబరాలు
సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్స్టర్ క్రైమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'దే కాల్ హిమ్ ఓజీ' (2025) చిత్రంపై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విజన్ తనకు ఎంతగానో నచ్చిందని, దీనిని ఒక యూనివర్స్గా (సీక్వెల్స్, ప్రీక్వెల్స్) విస్తరించే ఆలోచన ఉందని పవన్ కళ్యాణ్ గతంలో పలు సందర్భాల్లో తెలిపారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం క్రియేటివ్ వర్క్స్ కార్యాలయంలో దర్శకుడు సుజీత్, పవన్ మధ్య చర్చలు జరగడం ఓజీ2 ప్రాజెక్ట్పై కదలిక మొదలైందనడానికి సంకేతంగా నిలుస్తోంది. ఈ వార్త తెలియగానే పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. ఓజీ2 హ్యాష్ట్యాగ్తో పోస్టులు, మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్కు సంబంధించి మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.