భారీ భద్రత నడుమ.. దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ ప్రారంభం
- ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో రద్దయిన పాత నీట్ పరీక్ష
- జూన్ 21న రీ ఎగ్జామ్
- దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు
- కనీవినీ ఎరుగని రీతిలో భారీ భద్రతా ఏర్పాట్లు
- మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష
దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 5,440 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతోంది. 22 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష సాయంత్రం 5:15 గంటలకు ముగుస్తుంది. ఇది పూర్తిగా పెన్ అండ్ పేపర్ విధానంలో ఆఫ్ లైన్లో జరుగుతోంది.
పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతను నిలబెట్టేందుకు ఈసారి పటిష్ఠమైన చర్యలు చేపట్టారు. కేంద్రాల వద్ద 1.38 లక్షల సీసీటీవీ కెమెరాలు, 51,000కు పైగా జామర్లు ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ తర్వాతే విద్యార్థులను లోపలికి అనుమతించారు.
ప్రశ్నపత్రాల భద్రత కోసం భారత వైమానిక దళం సహకారం కూడా తీసుకున్నారు. లీక్లు, తప్పుడు ప్రచారాలను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు, సైబర్ నిఘా కొనసాగుతోంది. విద్యార్థులు కొత్త అడ్మిట్ కార్డు, ఫొటో ఐడీతో నిబంధనల ప్రకారం గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.