ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీపై అల్జీరియా ఫిర్యాదు

  • ఫిఫా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే విజృంభించిన మెస్సీ
  • హ్యాట్రిక్ గోల్స్ తో అల్జీరియాను చిత్తు చేసిన అర్జెంటీనా
  • మెస్సీ ఫౌల్ చేసినా రిఫరీ అతనికి రెడ్ కార్డ్ ఇవ్వలేదంటూ అల్జీరియా ఫిర్యాదు

గ్లోబల్ స్పోర్ట్స్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఈవెంట్ అయిన ఫిఫా ప్రపంచ కప్ సందడిగా కొనసాగుతోంది. అయితే టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లోనే అటు రికార్డుల వేట, ఇటు సంచలన లీగల్ వివాదాలు మొదలైపోయాయి. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ గోల్స్‌తో వీరవిహారం చేయగా.. పరాజయాన్ని జీర్ణించుకోలేని అల్జీరియా ఏకంగా ఫిఫా వద్ద మెస్సీపై అధికారికంగా ఫిర్యాదు చేయడం ఇప్పుడు స్పోర్ట్స్ వరల్డ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


గ్రూప్ స్టేజ్ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 తేడాతో అల్జీరియాను పూర్తిగా చిత్తు చేసింది. మెస్సీ మూడు గోల్స్ కొట్టి సత్తా చాటాడు. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత అల్జీరియా ఫుట్‌బాల్ బోర్డు నిర్వాహకులకు ఒక షాకింగ్ కంప్లైంట్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా మెస్సీ ఫౌల్ చేసినా రిఫరీ అతనికి ‘రెడ్ కార్డ్’ ఇవ్వలేదని ఆరోపించింది. మెస్సీ కాలు తమ కెప్టెన్ మాండీ పిక్కకు బలంగా తాకినట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపించినా రిఫరీ పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే మిడ్‌ఫీల్డర్ అలెక్సిస్ అలిస్టర్ కూడా తమ ప్లేయర్ ఇబ్రహీం మజాను మోచేతితో నెట్టివేసినా ఫౌల్ ఇవ్వలేదని అల్జీరియా ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఈ మ్యాచ్‌కు పోలాండ్‌కు చెందిన షిమోన్ మార్సినియక్ రిఫరీగా వ్యవహరించారు. విశేషం ఏంటంటే.. గత 2022 వరల్డ్ కప్ హిస్టారిక్ ఫైనల్‌లో (అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్) కూడా ఇతడే రిఫరీగా ఉండటం గమనార్హం. అందుకే రిఫరీ అర్జెంటీనాకు ఫేవరెటిజం చూపిస్తున్నాడంటూ అల్జీరియా మీడియా రచ్చ చేస్తోంది.


Lionel Messi
Algeria Football Board
FIFA World Cup
Argentina vs Algeria
Szymon Marciniak
Football hat-trick

More Telugu News