హైదరాబాద్ ఓఆర్ఆర్ పై షాకింగ్ దృశ్యం.. విలాసవంతమైన స్పోర్ట్స్ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు!
- ఇటీవల రూ.80 లక్షలతో కారును కొనుగోలు చేసిన టోలిచౌకి నివాసి
- రింగురోడ్డుపై 11 ఏళ్ల కొడుకు చేతికి స్టీరింగ్ ఇచ్చిన వైనం
- శంషాబాద్ - గచ్చిబౌలి మధ్య ప్రమాదకర డ్రైవింగ్
- రికార్డు చేసిన వాహనదారులు
- సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్
- కారును సీజ్ చేసి, తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను, ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా కాలరాస్తూ సాగిన ఒక ప్రమాదకరమైన డ్రైవింగ్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. ఔటర్ రింగ్ రోడ్డుపై కేవలం 11 ఏళ్ల వయసున్న బాలుడు ఖరీదైన లగ్జరీ కారును నడుపుతూ కనిపించాడు. జూన్ 11వ తేదీ రాత్రి వేళ టోలిచౌకి ప్రాంతానికి చెందిన అబ్దుల్ హాదీ అనే వ్యక్తి, తాను ఇటీవల రూ. 80 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన సరికొత్త విలాసవంతమైన కారును తన కొడుకు చేతికి ఇచ్చాడు. ఆ బాలుడు శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్లే మార్గంలో కారును నడుపుతుండగా.. పక్క నుంచి వెళ్తున్న ఇతర వాహనదారులు ఆ దృశ్యాన్ని తమ ఫోన్లలో రికార్డు చేసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ట్యాగ్ చేశారు.
ఈ వైరల్ వీడియో ఆధారంగా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు తక్షణమే దర్యాప్తు ప్రారంభించారు. కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ సాయంతో వాహన యజమాని అబ్దుల్ హాదీని గుర్తించారు. నిబంధనల ప్రకారం మైనర్లకు వాహనం ఇవ్వడం చట్టవిరుద్ధం కావడంతో పోలీసులు సదరు లగ్జరీ కారును స్వాధీనం చేసుకుని, తండ్రిపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కానప్పటికీ, జాతీయ రహదారులపై ఇలాంటి బాధ్యతారహితమైన పనులు చేయడం తీవ్ర ప్రమాదాలకు దారితీస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అతివేగానికి మరియు ఘోర ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్న ఔటర్ రింగ్ రోడ్డుపై కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని ఒక చిన్న పిల్లాడికి అంతటి ఖరీదైన కారును ఇవ్వడం పట్ల ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య బాలుడి ప్రాణాలకే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతర ప్రయాణికుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. పిల్లల సరదాల కోసం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రస్తుతం నిందితుడైన తండ్రి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వైరల్ వీడియో ఆధారంగా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు తక్షణమే దర్యాప్తు ప్రారంభించారు. కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ సాయంతో వాహన యజమాని అబ్దుల్ హాదీని గుర్తించారు. నిబంధనల ప్రకారం మైనర్లకు వాహనం ఇవ్వడం చట్టవిరుద్ధం కావడంతో పోలీసులు సదరు లగ్జరీ కారును స్వాధీనం చేసుకుని, తండ్రిపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కానప్పటికీ, జాతీయ రహదారులపై ఇలాంటి బాధ్యతారహితమైన పనులు చేయడం తీవ్ర ప్రమాదాలకు దారితీస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అతివేగానికి మరియు ఘోర ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్న ఔటర్ రింగ్ రోడ్డుపై కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని ఒక చిన్న పిల్లాడికి అంతటి ఖరీదైన కారును ఇవ్వడం పట్ల ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య బాలుడి ప్రాణాలకే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతర ప్రయాణికుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. పిల్లల సరదాల కోసం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రస్తుతం నిందితుడైన తండ్రి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.