అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- అమెరికా-ఇరాన్ ఒప్పందంతో బలపడిన గ్లోబల్ సెంటిమెంట్
- లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
- 544 పాయింట్ల లాభంతో 76,808 వద్ద ముగిసిన సెన్సెక్స్
- కీలకమైన 24,000 స్థాయికి సమీపంలో నిఫ్టీ
- మరింత బలపడిన రూపాయి.. తగ్గుముఖంలో డాలర్
అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల బాటలో పయనించాయి. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో సూచీలు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 544.15 పాయింట్లు (0.71%) లాభపడి 76,808.48 వద్ద స్థిరపడింది. అలాగే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 135.25 పాయింట్లు (0.57%) పెరిగి 23,995 వద్ద ముగిసింది. కీలకమైన 24,000 మార్కుకు కేవలం 5 పాయింట్ల దూరంలో నిలిచిపోయింది.
మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. నిఫ్టీకి 24,000 స్థాయి తక్షణ నిరోధకంగా ఉంది. ఈ మార్కును దాటి స్థిరపడితే బుల్ జోరు పెరిగి 24,200 నుంచి 24,400 స్థాయిలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కిందకు వస్తే, 23,900 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చని తెలిపారు.
నిఫ్టీలో హెచ్సీఎల్టెక్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు టాప్ గెయినర్స్గా నిలిచాయి. మరోవైపు సెన్సెక్స్ సూచీలో ఇండిగో, ఆల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, టాటా స్టీల్, ఎస్బీఐ, సన్ ఫార్మా షేర్లు నష్టపోయాయి.
రంగాల వారీగా చూస్తే రియల్ ఎస్టేట్, మీడియా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు రాణించగా, మెటల్ రంగం నష్టాలను చవిచూసింది. లార్జ్క్యాప్ షేర్లతో పాటు మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా 0.40 శాతానికి పైగా లాభపడటం విశేషం.
ఇదే సమయంలో డాలర్తో రూపాయి మారకం విలువ మరింత బలపడింది. యూఎస్డీ/ఐఎన్ఆర్ స్పాట్ రేటు 94.10 స్థాయికి చేరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 544.15 పాయింట్లు (0.71%) లాభపడి 76,808.48 వద్ద స్థిరపడింది. అలాగే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 135.25 పాయింట్లు (0.57%) పెరిగి 23,995 వద్ద ముగిసింది. కీలకమైన 24,000 మార్కుకు కేవలం 5 పాయింట్ల దూరంలో నిలిచిపోయింది.
మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. నిఫ్టీకి 24,000 స్థాయి తక్షణ నిరోధకంగా ఉంది. ఈ మార్కును దాటి స్థిరపడితే బుల్ జోరు పెరిగి 24,200 నుంచి 24,400 స్థాయిలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కిందకు వస్తే, 23,900 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చని తెలిపారు.
నిఫ్టీలో హెచ్సీఎల్టెక్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు టాప్ గెయినర్స్గా నిలిచాయి. మరోవైపు సెన్సెక్స్ సూచీలో ఇండిగో, ఆల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, టాటా స్టీల్, ఎస్బీఐ, సన్ ఫార్మా షేర్లు నష్టపోయాయి.
రంగాల వారీగా చూస్తే రియల్ ఎస్టేట్, మీడియా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు రాణించగా, మెటల్ రంగం నష్టాలను చవిచూసింది. లార్జ్క్యాప్ షేర్లతో పాటు మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా 0.40 శాతానికి పైగా లాభపడటం విశేషం.
ఇదే సమయంలో డాలర్తో రూపాయి మారకం విలువ మరింత బలపడింది. యూఎస్డీ/ఐఎన్ఆర్ స్పాట్ రేటు 94.10 స్థాయికి చేరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.