2047 వరకు మోదీయే ప్రధానిగా కొనసాగాలి: బండి సంజయ్
- ప్రధానిగా నెహ్రూ రికార్డును మోదీ బద్దలు కొట్టారన్న బండి సంజయ్
- అత్యధిక కాలం ప్రధానిగా మోదీ పేరు లిఖించబడిందని హర్షం
- మీనాక్షి నటరాజన్ వ్యవహారం ఎన్నికల కమిషన్ పరిధిలోనిదని వ్యాఖ్య
భారత రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారని, దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును బద్దలు కొట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొనియాడారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన అరుదైన రికార్డు మోదీ పేరిట లిఖించబడిందని హర్షం వ్యక్తం చేశారు.
"రాబోయే 2047 సంవత్సరం వరకూ నరేంద్ర మోదీయే దేశ ప్రధానిగా కొనసాగాలి. ఆయన తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాల ముందు భారతదేశ కీర్తి ప్రతిష్ఠలు శరవేగంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే భారత్ను 'విశ్వగురు' స్థానంలో నిలబెట్టడం ఖాయం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో, దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ స్పందించారు. ఆ వివాదం పూర్తిగా కేంద్ర ఎన్నికల కమిషన్ (ECI) పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. ఇందులో రాజకీయ జోక్యం ఏమీ లేదని, చట్టప్రకారం ఈసీనే దానిపై తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.