రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు

  • రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం 
  • జూన్ 10, 11 తేదీల్లో దేశ రాజధానిలోనే బస
  • తొలి రోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరు
  • రెండో రోజు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం
  • 11వ తేదీ రాత్రికి తిరిగి అమరావతికి రాక
సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి ఆయన ఢిల్లీలో పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొంటారు.

మరుసటి రోజు గురువారం నాడు రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సమావేశం ఉదయం 9:15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 9.00 గంటలకు అమరావతి చేరుకుంటారు.

Chandrababu Naidu
Delhi Visit
NDA Meeting
NITI Aayog Governing Council
Andhra Pradesh CM
Bharat Mandapam

More Telugu News