తిరుపతి కేంద్రంగా రైల్వే డివిజన్.. పాత డిమాండ్‌ను కొత్తగా తెరపైకి తెచ్చిన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy Requests Centre To Establish Tirupati Railway Division
  • తిరుపతి కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్
  • కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి
  • 'బాలాజీ రైల్వే డివిజన్' ఏర్పాటు చేయాలన్నది పాత డిమాండ్ అని వెల్లడి
  • ప్రస్తుతం తిరుపతి జిల్లా నాలుగు డివిజన్ల పరిధిలో ఉండటంతో సమస్యలు
  • ప్రత్యేక డివిజన్‌తో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని సూచన
తిరుపతి కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏటా కోట్లాది మంది భక్తులు సందర్శించే తిరుపతిలో రైల్వే సేవలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన ఒక విజ్ఞప్తి చేశారు.

తిరుపతి కేంద్రంగా 'బాలాజీ రైల్వే డివిజన్' ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉందని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని రైల్వే స్టేషన్లు... గుంతకల్, విజయవాడ, గుంటూరు, చెన్నై డివిజన్ల కింద ఉన్నాయని, దీనివల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. ఒకే ప్రాంతం నాలుగు డివిజన్ల పరిధిలో ఉండటం వల్ల ప్రయాణికుల నిర్వహణ, భద్రత, మౌలిక సదుపాయాల కల్పనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.

2024లోనే తిరుపతిని సుమారు 2.5 కోట్ల మంది భక్తులు సందర్శించారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న నగరానికి ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తే, లక్షలాది మంది యాత్రికుల అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టవచ్చని సూచించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైన నేపథ్యంలో, తిరుపతి డివిజన్ డిమాండ్‌ను కూడా పరిశీలించాలని ఆయన కోరారు.
Go Back to Shorts
Vijayasai Reddy
Tirupati Railway Division
Andhra Pradesh
Ashwini Vaishnav

More Telugu News