ఆర్సీబీకి రెండో టైటిల్ ... రియల్ ఛాంపియన్లలా ఆడారన్న కర్ణాటక కాబోయే సీఎం డీకే శివకుమార్
- వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ
- జట్టు చరిత్ర సృష్టించిందంటూ డీకే శివకుమార్ ప్రశంస
- ఇది ఆర్సీబీకి ఒక సువర్ణాధ్యాయమని వ్యాఖ్య
- ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, అభిమానులకు శుభాకాంక్షలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచి టైటిల్ను నిలబెట్టుకుంది. ఈ చారిత్రక విజయంపై కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. జట్టుకు, యాజమాన్యానికి, అభిమానులకు ఆయన అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా డీకే శివకుమార్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "ఈ రోజు బెంగళూరు ఛాంపియన్గా మరోసారి నిలిచింది. ఈసారి కూడా కప్ మనదే" అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ గెలిచి ఆర్సీబీ చరిత్ర సృష్టించిందని కొనియాడారు. మొక్కవోని దీక్ష, సంయమనంతో ఆడి నిజమైన ఛాంపియన్లలా నిలిచారని ప్రశంసించారు.
ఆర్సీబీ జట్టు యావత్ బెంగళూరు గర్వపడేలా చేసిందని ఆయన అన్నారు. ఈ అద్భుత ప్రయాణంలో అడుగడుగునా జట్టుకు అండగా నిలిచిన ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బందితో పాటు కోట్లాది మంది అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. "ఇది మన ఆర్సీబీకి ఒక సువర్ణాధ్యాయం" అంటూ తన పోస్ట్ను ముగించారు. ఈ విజయంతో బెంగళూరులో సంబరాలు అంబరాన్నంటాయి.
ఈ సందర్భంగా డీకే శివకుమార్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "ఈ రోజు బెంగళూరు ఛాంపియన్గా మరోసారి నిలిచింది. ఈసారి కూడా కప్ మనదే" అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ గెలిచి ఆర్సీబీ చరిత్ర సృష్టించిందని కొనియాడారు. మొక్కవోని దీక్ష, సంయమనంతో ఆడి నిజమైన ఛాంపియన్లలా నిలిచారని ప్రశంసించారు.
ఆర్సీబీ జట్టు యావత్ బెంగళూరు గర్వపడేలా చేసిందని ఆయన అన్నారు. ఈ అద్భుత ప్రయాణంలో అడుగడుగునా జట్టుకు అండగా నిలిచిన ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బందితో పాటు కోట్లాది మంది అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. "ఇది మన ఆర్సీబీకి ఒక సువర్ణాధ్యాయం" అంటూ తన పోస్ట్ను ముగించారు. ఈ విజయంతో బెంగళూరులో సంబరాలు అంబరాన్నంటాయి.