అంతరిక్ష రంగంలో హైదరాబాద్ సత్తా.. రీయూజబుల్ ఇంజిన్ పరీక్ష విజయవంతం!
- పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇంజిన్ను అభివృద్ధి చేసిన స్టార్టప్ 'అబ్యోమ్'
- అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించడంలో కీలక ముందడుగు
- ఈ స్టార్టప్కు బిట్స్ పిలానీ, ఐఐటీలు, ఇస్రో నుంచి మద్దతు
భారత అంతరిక్ష రంగంలో హైదరాబాద్కు చెందిన స్పేస్టెక్ స్టార్టప్ 'అబ్యోమ్ స్పేస్టెక్ & డిఫెన్స్' ఒక కీలక మైలురాయిని అందుకుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రీయూజబుల్ లిక్విడ్ రాకెట్ ఇంజిన్ క్వాలిఫికేషన్ టెస్ట్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఈ విజయం, అంతరిక్ష ప్రయోగాల వ్యయాన్ని గణనీయంగా తగ్గించే సాంకేతికతలో భారత్ ముందడుగు వేయడానికి దోహదపడనుంది.
కంపెనీకి చెందిన కమర్షియల్ టెస్ట్ ఫెసిలిటీలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ విజయం, త్వరలో చేపట్టనున్న 'హోప్' (వర్టికల్ టేకాఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్) అనే పునర్వినియోగ రాకెట్ ప్రాజెక్టుకు, అలాగే క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ పరీక్షల్లో వాడిన ఇంజిన్ సిస్టమ్స్, కంట్రోల్ ఆర్కిటెక్చర్ సహా అన్ని పరికరాలను తమ ఇంజనీరింగ్ బృందమే దేశీయంగా తయారు చేసిందని అబ్యోమ్ వెల్లడించింది.
ఈ విజయంపై సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో జైనుల్ అబిదీన్ మాట్లాడుతూ "భారత్లో స్వదేశీ పునర్వినియోగ ప్రొపల్షన్ వ్యవస్థల నిర్మాణంలో ఈ పరీక్షలు చాలా కీలకం. అంతరిక్ష ప్రయోగాల ఖర్చును భారీగా తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. తక్కువ ఖర్చుతో కూడిన రీయూజబుల్ స్పేస్ఫ్లైట్ కోసం టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తున్నాం" అని వివరించారు.
బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ ఇంక్యుబేటర్ నుంచి అబ్యోమ్ స్టార్టప్ ప్రారంభమైంది. ఈ సంస్థకు ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబేతో పాటు డీఎస్టీ, ఇస్రో, మెయిటీ వంటి ప్రభుత్వ సంస్థల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. రాబోయే రోజుల్లో రీయూజబుల్ రాకెట్ ప్రోటోటైప్ ప్రదర్శనలు, క్రయోజెనిక్ ఇంజిన్ల అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.
కంపెనీకి చెందిన కమర్షియల్ టెస్ట్ ఫెసిలిటీలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ విజయం, త్వరలో చేపట్టనున్న 'హోప్' (వర్టికల్ టేకాఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్) అనే పునర్వినియోగ రాకెట్ ప్రాజెక్టుకు, అలాగే క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ పరీక్షల్లో వాడిన ఇంజిన్ సిస్టమ్స్, కంట్రోల్ ఆర్కిటెక్చర్ సహా అన్ని పరికరాలను తమ ఇంజనీరింగ్ బృందమే దేశీయంగా తయారు చేసిందని అబ్యోమ్ వెల్లడించింది.
ఈ విజయంపై సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో జైనుల్ అబిదీన్ మాట్లాడుతూ "భారత్లో స్వదేశీ పునర్వినియోగ ప్రొపల్షన్ వ్యవస్థల నిర్మాణంలో ఈ పరీక్షలు చాలా కీలకం. అంతరిక్ష ప్రయోగాల ఖర్చును భారీగా తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. తక్కువ ఖర్చుతో కూడిన రీయూజబుల్ స్పేస్ఫ్లైట్ కోసం టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తున్నాం" అని వివరించారు.
బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ ఇంక్యుబేటర్ నుంచి అబ్యోమ్ స్టార్టప్ ప్రారంభమైంది. ఈ సంస్థకు ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబేతో పాటు డీఎస్టీ, ఇస్రో, మెయిటీ వంటి ప్రభుత్వ సంస్థల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. రాబోయే రోజుల్లో రీయూజబుల్ రాకెట్ ప్రోటోటైప్ ప్రదర్శనలు, క్రయోజెనిక్ ఇంజిన్ల అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.