సిద్ధరామయ్యకు భారీ ఆఫర్‌.. కాంగ్రెస్‌ ఆయన్ను ఎలా ఒప్పించింది?

  • సిద్ధరామయ్య రాజీనామాకు అధిష్ఠానం వ్యూహం
  • జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆఫర్
  • 2029 ఎన్నికల కోసం ఓబీసీ ఫేస్
  • రాజ్యసభ ద్వారా దిల్లీకి ప్రమోషన్
  • సిద్ధరామయ్య గౌరవం దెబ్బతినకుండా ప్లాన్
కర్ణాటకలో నాయకత్వ మార్పు ఖాయమైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయొచ్చనే ప్రచారం ఢిల్లీ, బెంగళూరు వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆయన తన నివాసంలో కేబినెట్ సహచరులకు అల్పాహార విందు ఇవ్వనున్నట్లు, ఆ తర్వాత మీడియా ముందుకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం జరిపిన సుదీర్ఘ చర్చల తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్యను ఒప్పించేందుకు పార్టీ పెద్దలు పక్కా వ్యూహం ప్రకారం ఆయనకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో గట్టిగా చర్చ జరుగుతోంది.

దేశవ్యాప్త ఓబీసీ ఫేస్?
ఢిల్లీలో జరిగిన అంతర్గత సమావేశాల్లో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సిద్ధరామయ్యతో మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కులగణన, సామాజిక న్యాయంపై ప్రధానంగా పోరాడుతోంది. ఈ తరుణంలో జాతీయ స్థాయిలో పార్టీకి ఒక బలమైన ఓబీసీ వ్యక్తి అవసరమని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్యకు ఉన్న సీనియార్టీని దృష్టిలో ఉంచుకొని ఆ కోణంలో ఆయన్ను ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

2029 ఎన్నికల వ్యూహం
రానున్న 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సిద్ధరామయ్యకు కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం పదవి నుంచి దించేస్తున్నట్లు కాకుండా ఆయనకు రాజకీయంగా పెద్ద ప్రమోషన్ ఇస్తున్నట్లుగా ఈ ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ఆయన సేవలు అవసరమనే కోణంలోనే చర్చలు జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజ్యసభ ద్వారా ఢిల్లీకి?
సిద్ధరామయ్యను రాజ్యసభ ద్వారా ఢిల్లీకి తీసుకురావాలనేది అధిష్ఠానం ప్లాన్‌గా కనిపిస్తోంది. జూన్ మొదటి వారంలో రాజ్యసభ నామినేషన్ల గడువు ఉండటంతో ఈలోపే ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఢిల్లీకి మారితే సిద్ధరామయ్యకు ఉన్న రాజకీయ ఇబ్బందులన్నీ తామే చూసుకుంటామని కాంగ్రెస్ పెద్దలు భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధిష్ఠానం మాత్రం కేవలం రాజ్యసభ స్థానాల ఎంపిక గురించే చర్చించామని అధికారికంగా చెబుతోంది.

Siddaramaiah
Karnataka
Congress
Chief Minister
OBC leader
Rajya Sabha
2029 elections
Rahul Gandhi
Mallikarjun Kharge
national politics

More Telugu News