చిరంజీవి ఆరోగ్యంపై అసత్య ప్రచారం .. యూట్యూబ్ ఛానల్ పై కేసు నమోదు

  • నటుడు చిరంజీవి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం
  • మార్ఫింగ్ వీడియోలు వైరల్ చేసిన ఓ యూట్యూబ్ ఛానెల్
  • నటుడి ప్రతిష్ఠకు భంగం కలిగించారని న్యాయవాది ఫిర్యాదు
  • జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు
ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన ఓ యూట్యూబ్ ఛానెల్‌పై కేసు నమోదైంది. చిరంజీవి ఆరోగ్యం క్షీణించిందంటూ తప్పుడు సమాచారంతో మార్ఫింగ్ వీడియోలను వైరల్ చేసినందుకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం, కమలాపురి కాలనీకి చెందిన న్యాయవాది రామకృష్ణ మిర్యాల జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్ చిరంజీవి ఆరోగ్యంపై తప్పుడు వార్తలు, మార్ఫింగ్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తోందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కంటెంట్ నటుడి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని ఆరోపించారు. తన ఆరోపణలకు మద్దతుగా సంబంధిత వీడియోలు, స్క్రీన్‌షాట్‌లను పోలీసులకు అందజేశారు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, కోర్టు నుంచి అనుమతి పొందిన అనంతరం సంబంధిత యూట్యూబ్ ఛానెల్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 

Chiranjeevi
Chiranjeevi health
false news
YouTube channel
Jubilee Hills police
Ramakrishna Miryala
social media
Tollywood
viral videos

More Telugu News