హైదరాబాద్లో కార్ రేసర్ల వీరంగం.. అడ్డుకున్న కానిస్టేబుల్కు గాయం
- హైదరాబాద్ మాదాపూర్లో అర్ధరాత్రి కార్ రేసింగ్ల హల్చల్
- అడ్డుకున్న కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టిన యువకుడు
- ప్రమాదంలో కానిస్టేబుల్ రమేష్ చేతికి ఫ్రాక్చర్
- కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు
- వారాంతపు డ్రంక్ అండ్ డ్రైవ్లో 294 మందిపై కేసులు
హైదరాబాద్లోని ఐటీ హబ్ మాదాపూర్లో యువకులు మరోసారి బరితెగించారు. అర్ధరాత్రి కార్ రేసింగ్తో హల్చల్ సృష్టించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టడంతో అతడి చేతికి ఫ్రాక్చర్ అయింది.
మాదాపూర్లోని నిలోఫర్ కేఫ్ సమీపంలో కొందరు యువకులు కార్ రేసింగ్, స్టంట్లు చేస్తూ గందరగోళం సృష్టించారు. మోడిఫైడ్ సైలెన్సర్తో ఓ కారు బీభత్సం సృష్టిస్తుండగా, లాఠీలతో ఉన్న ముగ్గురు పోలీసులు దానిని ఆపేందుకు ప్రయత్నించారు. కారు ఆగకపోవడంతో వెంబడించారు. ఈ క్రమంలో రమేష్ అనే కానిస్టేబుల్ కారును ఆపే ప్రయత్నం చేయగా, డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే అతడిని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ చేతికి గాయమైంది. కారు డ్రైవర్ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వీడియోలో, ఈ రేసింగ్ చూసేందుకు చాలా మంది యువకులు రోడ్డుపై గుమిగూడినట్లు కనిపించింది.
వారాంతాల్లో ఐటీ కారిడార్లో యువకులు ప్రమాదకరమైన కార్, బైక్ రేసింగ్లకు పాల్పడటం సాధారణమైపోయింది. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా వారు పట్టించుకోవడం లేదు.
డ్రంక్ అండ్ డ్రైవ్లో 294 మందిపై కేసులు
ఇదిలా ఉండగా, వారాంతంలో సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో 294 మంది పట్టుబడ్డారు. వీరిలో 255 మంది ద్విచక్రవాహనదారులు, 34 మంది కార్ డ్రైవర్లు, ఐదుగురు ఆటో డ్రైవర్లు ఉన్నారు. పట్టుబడిన వారందరినీ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. తాగి వాహనం నడిపి ప్రాణాంతక ప్రమాదాలకు కారణమైతే, భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్ 105 ప్రకారం 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించనున్నట్లు పోలీసులు హెచ్చరించారు.
మాదాపూర్లోని నిలోఫర్ కేఫ్ సమీపంలో కొందరు యువకులు కార్ రేసింగ్, స్టంట్లు చేస్తూ గందరగోళం సృష్టించారు. మోడిఫైడ్ సైలెన్సర్తో ఓ కారు బీభత్సం సృష్టిస్తుండగా, లాఠీలతో ఉన్న ముగ్గురు పోలీసులు దానిని ఆపేందుకు ప్రయత్నించారు. కారు ఆగకపోవడంతో వెంబడించారు. ఈ క్రమంలో రమేష్ అనే కానిస్టేబుల్ కారును ఆపే ప్రయత్నం చేయగా, డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే అతడిని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ చేతికి గాయమైంది. కారు డ్రైవర్ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వీడియోలో, ఈ రేసింగ్ చూసేందుకు చాలా మంది యువకులు రోడ్డుపై గుమిగూడినట్లు కనిపించింది.
వారాంతాల్లో ఐటీ కారిడార్లో యువకులు ప్రమాదకరమైన కార్, బైక్ రేసింగ్లకు పాల్పడటం సాధారణమైపోయింది. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా వారు పట్టించుకోవడం లేదు.
డ్రంక్ అండ్ డ్రైవ్లో 294 మందిపై కేసులు
ఇదిలా ఉండగా, వారాంతంలో సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో 294 మంది పట్టుబడ్డారు. వీరిలో 255 మంది ద్విచక్రవాహనదారులు, 34 మంది కార్ డ్రైవర్లు, ఐదుగురు ఆటో డ్రైవర్లు ఉన్నారు. పట్టుబడిన వారందరినీ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. తాగి వాహనం నడిపి ప్రాణాంతక ప్రమాదాలకు కారణమైతే, భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్ 105 ప్రకారం 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించనున్నట్లు పోలీసులు హెచ్చరించారు.