శ్రీలీల, తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తల్లి
- శ్రీలీల, తిలక్ వర్మ డేటింగ్ ప్రచారాన్ని ఖండించిన ఆమె తల్లి స్వర్ణలత
- ప్రస్తుతం శ్రీలీల దృష్టి సినిమా కెరీర్, నీట్-పీజీ చదువులపైనే ఉందని వెల్లడి
- తిరుమల దర్శనం, మ్యాచ్కు హాజరు కావడం యాదృచ్ఛికమేనని స్పష్టీకరణ
- శ్రీలీల వ్యక్తిగత విషయాలపై ఆలోచించడానికి మరో 5-6 ఏళ్లు పడుతుందని వ్యాఖ్య
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆమె తల్లి స్వర్ణలత తెరదించారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆమె ఖరాఖండిగా తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల్లో అణువంత కూడా నిజం లేదని, ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై పూర్తి స్పష్టతనిస్తూ స్వర్ణలత మాట్లాడుతూ.. "ప్రస్తుతం శ్రీలీల తన సినీ కెరీర్తో పాటు చదువులపైనా పూర్తి దృష్టి పెట్టింది. సినిమా షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సమయం దొరికినప్పుడల్లా తన వైద్య విద్యపై ఏకాగ్రత చూపుతోంది. ముఖ్యంగా నీట్-పీజీ పరీక్ష కోసం సన్నద్ధమవుతోంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించే దశకు ఇంకా చాలా సమయం ఉంది. బహుశా మరో ఐదు నుంచి ఆరు సంవత్సరాల తర్వాతే ఆ విషయాలపై దృష్టి పెడుతుంది" అని వివరించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంఘటనల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. 2025 డిసెంబర్లో తిరుమలలో శ్రీలీల, తిలక్ వర్మ కలిసి కనిపించడం, వాంఖడే స్టేడియంలో జరిగిన ఓ టీ20 మ్యాచ్కు శ్రీలీల హాజరుకావడం వంటివి కేవలం యాదృచ్ఛిక సంఘటనలేనని తెలిపారు. వాటి ఆధారంగా ఊహాగానాలు సృష్టించి సంబంధాన్ని అంటగట్టడం సరికాదని ఆమె హితవు పలికారు.
గతంలో కార్తిక్ ఆర్యన్తో వచ్చిన వార్తలను కూడా గుర్తుచేసిన స్వర్ణలత
గతంలో కూడా శ్రీలీలపై ఇలాంటి ప్రచారమే జరిగిందని స్వర్ణలత గుర్తుచేశారు. బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్తో శ్రీలీల రిలేషన్లో ఉన్నారంటూ వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ.. "కార్తిక్ ఆర్యన్ తల్లి, నేను ఇద్దరం గైనకాలజిస్టులం. మా మధ్య ఉన్న వృత్తిపరమైన పరిచయాన్ని తప్పుగా అర్థం చేసుకుని అప్పట్లో ఇలాంటి కథనాలే సృష్టించారు" అని ఆమె పేర్కొన్నారు. సినీ తారల వ్యక్తిగత జీవితాలపై ఆధారాలు లేకుండానే కథనాలు ప్రచారం చేయడం తగదని, అభిమానులు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ఆమె సూచించారు.
ఈ అంశంపై పూర్తి స్పష్టతనిస్తూ స్వర్ణలత మాట్లాడుతూ.. "ప్రస్తుతం శ్రీలీల తన సినీ కెరీర్తో పాటు చదువులపైనా పూర్తి దృష్టి పెట్టింది. సినిమా షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సమయం దొరికినప్పుడల్లా తన వైద్య విద్యపై ఏకాగ్రత చూపుతోంది. ముఖ్యంగా నీట్-పీజీ పరీక్ష కోసం సన్నద్ధమవుతోంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించే దశకు ఇంకా చాలా సమయం ఉంది. బహుశా మరో ఐదు నుంచి ఆరు సంవత్సరాల తర్వాతే ఆ విషయాలపై దృష్టి పెడుతుంది" అని వివరించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంఘటనల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. 2025 డిసెంబర్లో తిరుమలలో శ్రీలీల, తిలక్ వర్మ కలిసి కనిపించడం, వాంఖడే స్టేడియంలో జరిగిన ఓ టీ20 మ్యాచ్కు శ్రీలీల హాజరుకావడం వంటివి కేవలం యాదృచ్ఛిక సంఘటనలేనని తెలిపారు. వాటి ఆధారంగా ఊహాగానాలు సృష్టించి సంబంధాన్ని అంటగట్టడం సరికాదని ఆమె హితవు పలికారు.
గతంలో కార్తిక్ ఆర్యన్తో వచ్చిన వార్తలను కూడా గుర్తుచేసిన స్వర్ణలత
గతంలో కూడా శ్రీలీలపై ఇలాంటి ప్రచారమే జరిగిందని స్వర్ణలత గుర్తుచేశారు. బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్తో శ్రీలీల రిలేషన్లో ఉన్నారంటూ వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ.. "కార్తిక్ ఆర్యన్ తల్లి, నేను ఇద్దరం గైనకాలజిస్టులం. మా మధ్య ఉన్న వృత్తిపరమైన పరిచయాన్ని తప్పుగా అర్థం చేసుకుని అప్పట్లో ఇలాంటి కథనాలే సృష్టించారు" అని ఆమె పేర్కొన్నారు. సినీ తారల వ్యక్తిగత జీవితాలపై ఆధారాలు లేకుండానే కథనాలు ప్రచారం చేయడం తగదని, అభిమానులు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ఆమె సూచించారు.