నాగబాబు 'మేము copలం'... ట్రైలర్ లాంచ్ చేసిన బ్రహ్మీ
- బ్రహ్మానందం చేతుల మీదుగా 'మేము copలం' వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల
- జీ5 ఒరిజినల్ సిరీస్గా మే 22 నుంచి స్ట్రీమింగ్
- ప్రధాన పాత్రల్లో నటిస్తున్న నాగబాబు, రవి, కౌముది నెమాని
- ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్పై పెరిగిన అంచనాలు
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5, మరో కొత్త ఒరిజినల్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'మేము copలం' పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను ప్రముఖ నటుడు, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గురువారం ఆవిష్కరించారు. ఈ సిరీస్ మే 22 నుంచి జీ5 ఓటీటీలో ప్రీమియర్ కానుంది.
ఈ వెబ్ సిరీస్లో మెగా బ్రదర్ నాగబాబు ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, ఇందులో గెటప్ శ్రీను, రవితేజ నన్నిమల, రీతూ చౌదరి, కిరీటి దామరాజు, చరణ్ లక్కరాజు, సిరి పార్వతి తదితరులు నటిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ను రా ఎంటర్టైన్మెంట్స్, ప్రదీప్ మద్దాలి క్రియేటివ్ సంయుక్తంగా నిర్మించాయి. ట్రైలర్ను బట్టి ఇదొక ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కినట్టు తెలుస్తోంది.
ఇక లెజెండరీ నటుడు బ్రహ్మానందం చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడంపై చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. ఆయన వంటి గొప్ప నటుడు ట్రైలర్ లాంచ్ చేయడం సిరీస్లోని కంటెంట్పై ఉన్న నమ్మకాన్ని సూచిస్తోందని, దీనివల్ల ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. డాల్బీ ఆట్మాస్ టెక్నాలజీతో రానున్న ఈ సిరీస్ కథ, కథనాలు ఎలా ఉంటాయో చూడాలి.
కాగా, ఇటీవల ఈ చిత్రం టైటిల్ వివాదాస్పదమైంది. 'మేము కాపులం' అంటూ ఓ కులం పేరును ప్రస్తావిస్తున్నట్టుగా ఉందని విమర్శలు వచ్చాయి. అయితే, ఇది కులానికి సంబంధించినది కాకుండా, పోలీసు (cop)ల కథాంశంతో వస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ వెబ్ సిరీస్లో మెగా బ్రదర్ నాగబాబు ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, ఇందులో గెటప్ శ్రీను, రవితేజ నన్నిమల, రీతూ చౌదరి, కిరీటి దామరాజు, చరణ్ లక్కరాజు, సిరి పార్వతి తదితరులు నటిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ను రా ఎంటర్టైన్మెంట్స్, ప్రదీప్ మద్దాలి క్రియేటివ్ సంయుక్తంగా నిర్మించాయి. ట్రైలర్ను బట్టి ఇదొక ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కినట్టు తెలుస్తోంది.
ఇక లెజెండరీ నటుడు బ్రహ్మానందం చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడంపై చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. ఆయన వంటి గొప్ప నటుడు ట్రైలర్ లాంచ్ చేయడం సిరీస్లోని కంటెంట్పై ఉన్న నమ్మకాన్ని సూచిస్తోందని, దీనివల్ల ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. డాల్బీ ఆట్మాస్ టెక్నాలజీతో రానున్న ఈ సిరీస్ కథ, కథనాలు ఎలా ఉంటాయో చూడాలి.
కాగా, ఇటీవల ఈ చిత్రం టైటిల్ వివాదాస్పదమైంది. 'మేము కాపులం' అంటూ ఓ కులం పేరును ప్రస్తావిస్తున్నట్టుగా ఉందని విమర్శలు వచ్చాయి. అయితే, ఇది కులానికి సంబంధించినది కాకుండా, పోలీసు (cop)ల కథాంశంతో వస్తున్నట్టు తెలుస్తోంది.