'ఫిదా'లో 'భానుమతి' పాత్ర కోసం ఆరు నెలల టైమ్ అడిగిన సాయి పల్లవి!

  • 'ఫిదా' ఆఫర్ వచ్చేసరికి జార్జియాలో ఎంబీబీఎస్ చదువుతున్న సాయి పల్లవి
  • సినిమా కోసం దర్శకుడు శేఖర్ కమ్ములను ఆరు నెలలు టైమ్ అడిగిన వైనం
  • తెలంగాణ యాస నేర్చుకుని, సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకున్న సాయి పల్లవి
  • భానుమతి పాత్ర కోసం ఆమె డెడికేషన్ సినిమా విజయంలో కీలక పాత్ర 
'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటి సాయి పల్లవి. ఆమె పోషించిన భానుమతి పాత్ర ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. అయితే, ఆ పాత్ర అంతగా పండటం వెనుక ఆమె అంకితభావం, పట్టుదల ఉన్నాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల 'ఫిదా' కథతో సంప్రదించినప్పుడు, సాయి పల్లవి జార్జియాలో ఎంబీబీఎస్ చివరి దశలో ఉన్నారు.

సినిమా చేయడానికి వెంటనే అంగీకరించినప్పటికీ, తన చదువు పూర్తి చేయడానికి ఆరు నెలల సమయం కావాలని దర్శకుడిని కోరారు. ఆమె నిబద్ధతను అర్థం చేసుకున్న శేఖర్ కమ్ముల అందుకు అంగీకరించారు. 2016లో డిగ్రీ పూర్తి చేసుకుని వచ్చిన సాయి పల్లవి, ఆ తర్వాత 'ఫిదా' కోసం సిద్ధమయ్యారు. తమిళనాడుకు చెందిన ఆమెకు తెలంగాణ యాసలో మాట్లాడటం పెద్ద సవాలుగా మారింది.

సాధారణంగా ఇతర భాషా నటీమణులకు డబ్బింగ్ ఆర్టిస్టులు గాత్రదానం చేస్తారు. కానీ, సాయి పల్లవి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల సహాయంతో తెలంగాణ యాసలోని నుడికారాలను, ఉచ్ఛారణను ఓపికగా నేర్చుకున్నారు. డబ్బింగ్ సమయంలో ఎన్నో తప్పులు చేసినా, పట్టుదలతో మళ్లీ మళ్లీ ప్రయత్నించి భానుమతి పాత్రకు ప్రాణం పోశారు. ఆమె సొంత గొంతుతో పలికిన సంభాషణలకు థియేటర్లలో విశేష స్పందన లభించింది. ఈ డెడికేషనే ఆమెను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది.

Sai Pallavi
Fidaa
Bhanumathi
Sekhar Kammula
Telugu movie
Tollywood
Sai Pallavi Fidaa
Telugu cinema
Telangana accent
Dubbing

More Telugu News