‘నేను కాదు మనం’ అనే స్ఫూర్తితో పనిచేయాలి: సీఎం చంద్రబాబు
- ముగిసిన 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం
- చంద్రబాబు కీలక ప్రసంగం
- 25 ప్రాధాన్యతా ప్రాజెక్టుల పూర్తికి ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల
- అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు సంతృప్త స్థాయిలో ఇవ్వాలని ఆదేశం
- 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామన్న సీఎం
రాష్ట్ర పరిపాలనలో ప్రజలే కేంద్రంగా పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించాలని, 'నేను కాదు, మనం' అనే సామూహిక స్ఫూర్తితో ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో రెండు రోజుల పాటు జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ శుక్రవారం ముగిసింది. సుమారు 22 గంటల పాటు సాగిన ఈ మారథాన్ సమావేశాల్లో కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి పలు కీలక అంశాలపై సమీక్షించారు. ముగింపు ఉపన్యాసంలో రాష్ట్ర సాగునీటి రంగంపై కీలక ప్రకటన చేస్తూ, 25 ప్రాధాన్యతా ప్రాజెక్టులను నిర్దిష్ట గడువులోగా పూర్తిచేసేందుకు ఉద్దేశించిన 'ఇరిగేషన్ క్యాలెండర్'ను విడుదల చేశారు.
పాలనలో టీమ్ వర్క్ ప్రాధాన్యతను ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. "నేను అనే అహం వీడి, మనం అనే భావనతో కలిసికట్టుగా పనిచేస్తేనే అద్భుతమైన ఫలితాలు సాధించగలం. మన పాలన పూర్తిగా పౌర కేంద్రంగా (సిటిజెన్ సెంట్రిక్) ఉండాలి. నేను ప్రతి సోమవారం ప్రజాదర్భార్ ద్వారా ప్రజల సమస్యలు వింటున్నాను. ఇకపై మీరు కూడా ప్రతి శుక్రవారం ఒక నియోజకవర్గానికి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలి" అని అధికారులను ఆదేశించారు.
అత్యుత్తమ పాలనా విధానాలను అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందాన్ని సింగపూర్ పంపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలని, కనీస అవసరాలు తీర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. "రాష్ట్రంలో రహదారులు, వీధిదీపాలు, మురుగునీటి పారుదల వంటి మౌలిక వసతులను మెరుగుపరచడంపై దృష్టి సారించాం. పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు 'పీ4' (ప్రజలు, ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యం) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం" అని వివరించారు.
ప్రజలపై విద్య, వైద్యం, విద్యుత్ భారాన్ని తగ్గించేలా అధికారులు చొరవ చూపాలని, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. తాము నిర్వహించే సమీక్షలు, సమావేశాలన్నీ పేద, మధ్యతరగతి వర్గాల సంక్షేమం కోసమేనని గుర్తుంచుకోవాలన్నారు.
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీకి బ్రాండ్ ఇమేజ్
రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక విధానాల వల్ల గత 23 నెలల్లో నెలకు లక్ష కోట్ల చొప్పున మొత్తం రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీనివల్ల 24 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. "ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కారణంగానే పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే ఇవి సాధ్యమవుతాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి" అని ఎస్పీలకు సూచించారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని, వాటిని క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా (గ్రౌండింగ్) చూసే బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలు తీసుకోవాలని ఆదేశించారు. గూగుల్, రిలయన్స్ వంటి డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో వస్తున్న పెట్టుబడులు రాష్ట్ర భవిష్యత్తుకు సంకేతమని అన్నారు.
లాజిస్టిక్స్ హబ్గా ఏపీ... మౌలిక సదుపాయాల కల్పన
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చంద్రబాబు తెలిపారు. "రాష్ట్రంలో రూ.1.03 లక్షల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. ఇచ్చాపురం నుంచి చెన్నై వరకు నాలుగు లైన్ల రైల్వే ట్రాక్ రాబోతోంది. రూ.10 వేల కోట్లతో పోర్టులు, ఎయిర్పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నాం. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఏపీ దేశంలోనే కీలకమైన లాజిస్టిక్స్ హబ్గా మారుతుంది," అని సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టుల వేగవంతమైన పూర్తికి భూసేకరణ వంటి అంశాలను కలెక్టర్లు చొరవ తీసుకుని పరిష్కరించాలని సూచించారు.
సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం.. ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల
రాష్ట్ర జీవనాధారమైన సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. "పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు, విశాఖ పరిశ్రమలకు నీరందిస్తాం. ఈ ఏడాది వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేయబోతున్నాం. నేరడి బ్యారేజ్ పనులు కూడా ఈ ఏడాదే ప్రారంభిస్తాం. ఉత్తరాంధ్రలోని పెండింగ్ ప్రాజెక్టులను వచ్చే రెండేళ్లలో, రాయలసీమలో హంద్రీనీవా ద్వారా చివరి ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇందులో భాగంగా 25 ప్రాధాన్యతా ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేసేందుకు ఇరిగేషన్ క్యాలెండర్ను విడుదల చేస్తున్నాం" అని తెలిపారు. గుంటూరు ఛానల్, తుంగభద్ర, కాటన్ బ్యారేజ్ గేట్ల మరమ్మతులు కూడా ఇందులో భాగంగానే పూర్తి చేస్తామని చెప్పారు.
అందరికీ ఇళ్లు.. సంక్షేమ పథకాల పటిష్ఠ అమలు
సంతృప్త స్థాయిలో అందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. "ఆగస్టు 15లోగా 2.50 లక్షల ఇళ్లకు, డిసెంబర్ నాటికి మరో 2.38 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు జరగాలి. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి వాటిని క్రమబద్ధీకరించాలి. 22ఏ భూముల సమస్యలను వచ్చే కలెక్టర్ల సమావేశంలోగా పరిష్కరించాలి" అని ఆదేశించారు.
బుడగజంగాలకు ఎస్సీలకు వర్తించే ప్రయోజనాలను (ఉద్యోగాలు మినహా) అందించాలని, బీసీ రిజర్వేషన్ల కోసం కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అరకు కాఫీకి గ్లోబల్ బ్రాండ్ తీసుకురావాలని, జాతీయ, అంతర్జాతీయ విద్య కోసం పావలా వడ్డీకే రుణాలు అందించాలని సూచించారు. అధికారులు టాస్క్ ఫోర్స్గా ఏర్పడి, ఉత్తమ పద్ధతులను అవలంబిస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
పాలనలో టీమ్ వర్క్ ప్రాధాన్యతను ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. "నేను అనే అహం వీడి, మనం అనే భావనతో కలిసికట్టుగా పనిచేస్తేనే అద్భుతమైన ఫలితాలు సాధించగలం. మన పాలన పూర్తిగా పౌర కేంద్రంగా (సిటిజెన్ సెంట్రిక్) ఉండాలి. నేను ప్రతి సోమవారం ప్రజాదర్భార్ ద్వారా ప్రజల సమస్యలు వింటున్నాను. ఇకపై మీరు కూడా ప్రతి శుక్రవారం ఒక నియోజకవర్గానికి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రజాదర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలి" అని అధికారులను ఆదేశించారు.
అత్యుత్తమ పాలనా విధానాలను అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందాన్ని సింగపూర్ పంపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలని, కనీస అవసరాలు తీర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. "రాష్ట్రంలో రహదారులు, వీధిదీపాలు, మురుగునీటి పారుదల వంటి మౌలిక వసతులను మెరుగుపరచడంపై దృష్టి సారించాం. పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు 'పీ4' (ప్రజలు, ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యం) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం" అని వివరించారు.
ప్రజలపై విద్య, వైద్యం, విద్యుత్ భారాన్ని తగ్గించేలా అధికారులు చొరవ చూపాలని, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. తాము నిర్వహించే సమీక్షలు, సమావేశాలన్నీ పేద, మధ్యతరగతి వర్గాల సంక్షేమం కోసమేనని గుర్తుంచుకోవాలన్నారు.
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీకి బ్రాండ్ ఇమేజ్
రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక విధానాల వల్ల గత 23 నెలల్లో నెలకు లక్ష కోట్ల చొప్పున మొత్తం రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీనివల్ల 24 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. "ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కారణంగానే పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే ఇవి సాధ్యమవుతాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి" అని ఎస్పీలకు సూచించారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని, వాటిని క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా (గ్రౌండింగ్) చూసే బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలు తీసుకోవాలని ఆదేశించారు. గూగుల్, రిలయన్స్ వంటి డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో వస్తున్న పెట్టుబడులు రాష్ట్ర భవిష్యత్తుకు సంకేతమని అన్నారు.
లాజిస్టిక్స్ హబ్గా ఏపీ... మౌలిక సదుపాయాల కల్పన
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చంద్రబాబు తెలిపారు. "రాష్ట్రంలో రూ.1.03 లక్షల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. ఇచ్చాపురం నుంచి చెన్నై వరకు నాలుగు లైన్ల రైల్వే ట్రాక్ రాబోతోంది. రూ.10 వేల కోట్లతో పోర్టులు, ఎయిర్పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నాం. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఏపీ దేశంలోనే కీలకమైన లాజిస్టిక్స్ హబ్గా మారుతుంది," అని సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టుల వేగవంతమైన పూర్తికి భూసేకరణ వంటి అంశాలను కలెక్టర్లు చొరవ తీసుకుని పరిష్కరించాలని సూచించారు.
సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం.. ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల
రాష్ట్ర జీవనాధారమైన సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. "పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు, విశాఖ పరిశ్రమలకు నీరందిస్తాం. ఈ ఏడాది వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేయబోతున్నాం. నేరడి బ్యారేజ్ పనులు కూడా ఈ ఏడాదే ప్రారంభిస్తాం. ఉత్తరాంధ్రలోని పెండింగ్ ప్రాజెక్టులను వచ్చే రెండేళ్లలో, రాయలసీమలో హంద్రీనీవా ద్వారా చివరి ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇందులో భాగంగా 25 ప్రాధాన్యతా ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేసేందుకు ఇరిగేషన్ క్యాలెండర్ను విడుదల చేస్తున్నాం" అని తెలిపారు. గుంటూరు ఛానల్, తుంగభద్ర, కాటన్ బ్యారేజ్ గేట్ల మరమ్మతులు కూడా ఇందులో భాగంగానే పూర్తి చేస్తామని చెప్పారు.
అందరికీ ఇళ్లు.. సంక్షేమ పథకాల పటిష్ఠ అమలు
సంతృప్త స్థాయిలో అందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. "ఆగస్టు 15లోగా 2.50 లక్షల ఇళ్లకు, డిసెంబర్ నాటికి మరో 2.38 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు జరగాలి. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి వాటిని క్రమబద్ధీకరించాలి. 22ఏ భూముల సమస్యలను వచ్చే కలెక్టర్ల సమావేశంలోగా పరిష్కరించాలి" అని ఆదేశించారు.
బుడగజంగాలకు ఎస్సీలకు వర్తించే ప్రయోజనాలను (ఉద్యోగాలు మినహా) అందించాలని, బీసీ రిజర్వేషన్ల కోసం కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అరకు కాఫీకి గ్లోబల్ బ్రాండ్ తీసుకురావాలని, జాతీయ, అంతర్జాతీయ విద్య కోసం పావలా వడ్డీకే రుణాలు అందించాలని సూచించారు. అధికారులు టాస్క్ ఫోర్స్గా ఏర్పడి, ఉత్తమ పద్ధతులను అవలంబిస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.