వేంపల్లిలో విచారణ ముగిసిన తర్వాత.. పోలీసు అధికారులకు అంబటి వార్నింగ్

Ambati Rambabu warning to Police Officers
  • అంబటిని సుమారు రెండు గంటల పాటు విచారించిన వేంపల్లి పోలీసులు
  • నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారుల చిట్టా తమ వద్ద ఉందన్న అంబటి
  • తమను వేధించిన ప్రతి అధికారి శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరిక

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణ ముగిసిన అనంతరం మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు పోలీసు అధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ విచారణ తర్వాత, ఆయన మీడియా ముందు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులకు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు.


రాబోయే కాలంలో మళ్లీ జగన్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేసిన అంబటి... అధికారులకు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారుల జాబితా తమ వద్ద ఉందని, సమయం వచ్చినప్పుడు వారందరినీ చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. తప్పుడు కేసులు పెట్టి వేధించిన ప్రతి అధికారి శిక్ష అనుభవించక తప్పదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.


ఒకే ఒక్క అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చట్టవిరుద్ధంగా తనపై 36 కేసులు నమోదు చేయడం ఏంటని అంబటి ప్రశ్నించారు. మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా, రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థను వాడుకోవడం ప్రజాస్వామ్యానికే విఘాతమని ఆయన విమర్శించారు. తాము వైఎస్సార్ వారసులమని, ఇలాంటి కేసులకు భయపడబోమని స్పష్టం చేశారు.



Go Back to Shorts
Ambati Rambabu
YSRCP
Police

More Telugu News