‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’గా చంద్రబాబు.. ఏపీకి దక్కిన గౌరవమన్న మంత్రులు
- సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం
- ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్లో ప్రతిష్ఠాత్మక గౌరవం
- ఇది ఏపీకి దక్కిన గౌరవమన్న మంత్రులు
- సీఎం సంస్కరణలు, దార్శనికతకు గుర్తింపు అని హర్షం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. దేశ ఆర్థిక రంగంలో ప్రతిష్టాత్మకమైన 'ది ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్' కార్యక్రమంలో ఆయన 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు రావడం పట్ల రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, కింజరాపు అచ్చెన్నాయుడు, అనిత హర్షం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, "ఇది ఒక గొప్ప క్షణం. ముఖ్యమంత్రి దార్శనికత, సంస్కరణలు, అమలు తీరుకు ఇది నిదర్శనం. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది" అని పేర్కొన్నారు.
ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం అమలు చేస్తున్న పారదర్శక విధానాలు, సంస్కరణలకు ఈ పురస్కారం తార్కాణమని తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహం, ఉద్యోగాల కల్పనలో ముఖ్యమంత్రి దూరదృష్టి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని వివరించారు.
హోంమంత్రి అనిత స్పందిస్తూ, ఇది ఏపీకి వస్తున్న పెట్టుబడులకు, రాష్ట్రంలో ఉన్న 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు వచ్చిన అవార్డు అని అభివర్ణించారు. ఈ పురస్కారం రాష్ట్రానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, "ఇది ఒక గొప్ప క్షణం. ముఖ్యమంత్రి దార్శనికత, సంస్కరణలు, అమలు తీరుకు ఇది నిదర్శనం. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది" అని పేర్కొన్నారు.
ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం అమలు చేస్తున్న పారదర్శక విధానాలు, సంస్కరణలకు ఈ పురస్కారం తార్కాణమని తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహం, ఉద్యోగాల కల్పనలో ముఖ్యమంత్రి దూరదృష్టి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని వివరించారు.
హోంమంత్రి అనిత స్పందిస్తూ, ఇది ఏపీకి వస్తున్న పెట్టుబడులకు, రాష్ట్రంలో ఉన్న 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు వచ్చిన అవార్డు అని అభివర్ణించారు. ఈ పురస్కారం రాష్ట్రానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.