బెంగాల్లో ఇవాళ నమోదైన పోలింగ్ శాతమే దీనికి నిదర్శనం: ప్రధాని మోదీ
- బెంగాల్లో నేడు 152 స్థానాల్లో తొలి దశ పోలింగ్
- రికార్డు స్థాయిలో పోటెత్తిన ఓటర్లు
- మే 4వ తేదీ బెంగాల్ లో మార్పునకు నాది అంటూ మోదీ హర్షం
- టీఎంసీకి వ్యతిరేకంగా మహిళలు, యువత పోరాటం ప్రారంభించారని వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా దండెత్తింది బీజేపీ కాదని... రాష్ట్రంలోని మహిళలు, యువతే చురుకైన పోరాటాన్ని ప్రారంభించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గురువారం 152 నియోజకవర్గాల్లో జరిగిన తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన అధిక ఓటింగ్ శాతమే దీనికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
బెంగాల్ లో సాయంత్రం 5 గంటల సమయానికి 89.93 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరగనున్న నేపథ్యంలో, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మధురాపూర్లో నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని మాట్లాడారు.
తీవ్రమైన ఎండను కూడా లెక్కచేయకుండా ఓటర్లు పోటెత్తడం చూస్తుంటే, మే 4వ తేదీ కేవలం ఫలితాల రోజు మాత్రమే కాదని, పశ్చిమ బెంగాల్లో మార్పునకు నాంది పలికే రోజని రుజువు చేస్తోందని మోదీ పేర్కొన్నారు. "ఈరోజు ఓటర్లలో కనిపించిన ఉత్సాహం, ముఖ్యంగా మహిళలు, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతలో కనిపించిన ఆసక్తి, తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిజమైన పోరాటాన్ని ప్రారంభించింది వారేనని నిరూపించింది" అని ఆయన వివరించారు.
ఇటీవల లోక్సభలో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణను అడ్డుకోవడంలో తృణమూల్ కాంగ్రెస్ పోషించిన పాత్రతో ఆ పార్టీ అసలు స్వరూపం రాష్ట్రంలోని మహిళలకు అర్థమైందని మోదీ అన్నారు.
"లోక్సభలో జరిగిన పరిణామాలతో తృణమూల్, ఇతర ప్రతిపక్ష పార్టీల మహిళా వ్యతిరేక వైఖరి బయటపడింది. అందుకే ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు గట్టి గుణపాఠం చెప్పాలని బెంగాల్ మహిళలు నిర్ణయించుకున్నారు. మహిళా సాధికారతకు అడ్డంకిగా నిలిచినందుకు ఈసారి తృణమూల్ను వారు కచ్చితంగా శిక్షిస్తారు. బెంగాల్ కాళీమాత, దుర్గామాత వెలసిన నేల. కానీ తృణమూల్ పాలనలో ఇక్కడ మహిళలకు భద్రత లేదు. కాబట్టి మీ ఓటు అన్నింటినీ మారుస్తుంది. ఇకపై అన్యాయాన్ని సహించవద్దు" అని ఆయన పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు మే 4వ తేదీ గడువు తేదీ అవుతుందని మోదీ జోస్యం చెప్పారు. అవినీతి, దోపిడీ, హింస, మహిళలపై నేరాలతో నిండిన చీకటి రోజులు ఆ రోజుతో ముగిసిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత, అక్రమ చొరబాట్ల విషయంలో శూన్య సహన విధానాన్ని అవలంబిస్తామని స్పష్టం చేశారు.
"దక్షిణ 24 పరగణాల జిల్లాలో స్థానిక మత్స్యకారుల హక్కుల వాటాను అక్రమ చొరబాటుదారులు లాక్కుంటున్నారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం తమ ఓట్ల కోసం అక్రమ చొరబాట్లను కొనసాగించాలని కోరుకుంటోంది. అక్రమ చొరబాటుదారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తృణమూల్ వ్యతిరేకిస్తోంది" అని ప్రధాని ఆరోపించారు.
బెంగాల్ లో సాయంత్రం 5 గంటల సమయానికి 89.93 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరగనున్న నేపథ్యంలో, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మధురాపూర్లో నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని మాట్లాడారు.
తీవ్రమైన ఎండను కూడా లెక్కచేయకుండా ఓటర్లు పోటెత్తడం చూస్తుంటే, మే 4వ తేదీ కేవలం ఫలితాల రోజు మాత్రమే కాదని, పశ్చిమ బెంగాల్లో మార్పునకు నాంది పలికే రోజని రుజువు చేస్తోందని మోదీ పేర్కొన్నారు. "ఈరోజు ఓటర్లలో కనిపించిన ఉత్సాహం, ముఖ్యంగా మహిళలు, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతలో కనిపించిన ఆసక్తి, తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిజమైన పోరాటాన్ని ప్రారంభించింది వారేనని నిరూపించింది" అని ఆయన వివరించారు.
ఇటీవల లోక్సభలో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణను అడ్డుకోవడంలో తృణమూల్ కాంగ్రెస్ పోషించిన పాత్రతో ఆ పార్టీ అసలు స్వరూపం రాష్ట్రంలోని మహిళలకు అర్థమైందని మోదీ అన్నారు.
"లోక్సభలో జరిగిన పరిణామాలతో తృణమూల్, ఇతర ప్రతిపక్ష పార్టీల మహిళా వ్యతిరేక వైఖరి బయటపడింది. అందుకే ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు గట్టి గుణపాఠం చెప్పాలని బెంగాల్ మహిళలు నిర్ణయించుకున్నారు. మహిళా సాధికారతకు అడ్డంకిగా నిలిచినందుకు ఈసారి తృణమూల్ను వారు కచ్చితంగా శిక్షిస్తారు. బెంగాల్ కాళీమాత, దుర్గామాత వెలసిన నేల. కానీ తృణమూల్ పాలనలో ఇక్కడ మహిళలకు భద్రత లేదు. కాబట్టి మీ ఓటు అన్నింటినీ మారుస్తుంది. ఇకపై అన్యాయాన్ని సహించవద్దు" అని ఆయన పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు మే 4వ తేదీ గడువు తేదీ అవుతుందని మోదీ జోస్యం చెప్పారు. అవినీతి, దోపిడీ, హింస, మహిళలపై నేరాలతో నిండిన చీకటి రోజులు ఆ రోజుతో ముగిసిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత, అక్రమ చొరబాట్ల విషయంలో శూన్య సహన విధానాన్ని అవలంబిస్తామని స్పష్టం చేశారు.
"దక్షిణ 24 పరగణాల జిల్లాలో స్థానిక మత్స్యకారుల హక్కుల వాటాను అక్రమ చొరబాటుదారులు లాక్కుంటున్నారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం తమ ఓట్ల కోసం అక్రమ చొరబాట్లను కొనసాగించాలని కోరుకుంటోంది. అక్రమ చొరబాటుదారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తృణమూల్ వ్యతిరేకిస్తోంది" అని ప్రధాని ఆరోపించారు.