సత్యసాయి జిల్లాలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి... 12 మంది పరిస్థితి విషమం
- సత్యసాయి జిల్లా కదిరిలో భారీ పేలుడు
- డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఘటన
- ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి
- 20 మందికి తీవ్ర గాయాలు
- క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ ఆదేశం
శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కదిరి మండలంలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది.
వివరాల్లోకి వెళితే, కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని ఓ కూలీ ఇంట్లో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నాలుగు డిటోనేటర్లు మొదట పేలాయి. ఈ పేలుడు ధాటికి మంటలు చెలరేగి, అక్కడే ఉన్న గ్యాస్ సిలిండర్లకు అంటుకున్నాయి. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించి, ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఈ దుర్ఘటనపై మంత్రి సత్యకుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అక్రమంగా డిటోనేటర్లు ఎందుకు నిల్వ ఉంచారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని ఓ కూలీ ఇంట్లో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నాలుగు డిటోనేటర్లు మొదట పేలాయి. ఈ పేలుడు ధాటికి మంటలు చెలరేగి, అక్కడే ఉన్న గ్యాస్ సిలిండర్లకు అంటుకున్నాయి. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించి, ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఈ దుర్ఘటనపై మంత్రి సత్యకుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అక్రమంగా డిటోనేటర్లు ఎందుకు నిల్వ ఉంచారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.