కెప్టెన్ అజింక్యా రహానేకు డబుల్ ట్రబుల్.. ఓటమికి తోడు రూ.12 లక్షల జరిమానా!

  • వరుస ఓటములతో సతమతమవుతున్న కేకేఆర్‌ కెప్టెన్ అజింక్యా రహానే
  • చెన్నైతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు రూ.12 లక్షల జరిమానా
  • ఈ సీజన్‌లో కోల్‌కతాకు ఇది తొలి తప్పిదం అని తెలిపిన ఐపీఎల్ కౌన్సిల్
  • ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని కోల్‌క‌తా
ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) కెప్టెన్ అజింక్యా రహానేకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షల భారీ జరిమానా విధించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒక‌టి వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కాగా, నాలుగింట‌ కేకేఆర్‌ ఓటమి పాలవడం గమనార్హం.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రహానే సేన నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయడంలో విఫలమైంది. ఇది ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పేర్కొంది. ఈ సీజన్‌లో కేకేఆర్ జట్టుకు ఇది మొదటి తప్పిదం కావడంతో కెప్టెన్ రహానేకు రూ.12 లక్షల జరిమానాతో సరిపెట్టినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, చెన్నై బౌలర్లు నూర్ అహ్మద్ మూడు వికెట్లతో, అన్షుల్ కంబోజ్ రెండు వికెట్లతో చెలరేగడంతో కోల్‌కతా మరో ఓటమిని మూటగట్టుకుంది. ఈ విజయంతో చెన్నై జట్టు ఈ సీజన్‌లో రెండో గెలుపును నమోదు చేసుకుని, 4 పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరింది. మరోవైపు ఒక్క విజయం కూడా లేకుండా రహానే నాయకత్వంలోని కోల్‌కతా జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

Ajinkya Rahane
IPL 2026
Kolkata Knight Riders
KKR
Chennai Super Kings
CSK
Slow Over Rate
Fine
MA Chidambaram Stadium
Noor Ahmad

More Telugu News