ఇరాన్పై అమెరికా కఠిన చర్యలు.. నౌకాశ్రయాలపై పూర్తి దిగ్బంధనం
ఇరాన్తో చర్చలు విఫలం కావడంతో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధి మీదుగా ఇరాన్ నౌకాశ్రయాలకు వెళ్లే అన్ని సముద్ర మార్గాలను దిగ్బంధిస్తున్నట్లు (బ్లాకేడ్) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి.
అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ప్రకారం, ఈ దిగ్బంధనం సోమవారం ఉదయం 10 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30) అమల్లోకి వస్తుంది. ఇరాన్ పోర్టులను ఉపయోగించుకునే అన్ని దేశాల నౌకలకు ఇది వర్తిస్తుందని సెంట్కామ్ స్పష్టం చేసింది. అయితే, ఇరానేతర పోర్టులకు వెళ్లే నౌకల రాకపోకలకు మాత్రం ఎలాంటి అంతరాయం ఉండదని, స్వేచ్ఛా నౌకాయానానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.
సోషల్ మీడియాలో ట్రంప్ తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్కు "అక్రమ టోల్" చెల్లించే ఏ నౌకనైనా అంతర్జాతీయ జలాల్లో అడ్డగిస్తామని స్పష్టం చేశారు. "అమెరికా లేదా ఇతర శాంతియుత నౌకలపై ఇరాన్ దాడికి పాల్పడితే వారిని నరకానికి పంపుతాం" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ అమర్చినట్లు ఆరోపిస్తున్న మైన్లను కూడా తొలగిస్తామని తెలిపారు.
అమెరికా చర్యలపై ఇరాన్ కూడా అంతే తీవ్రంగా స్పందించింది. ట్రంప్ బెదిరింపులకు భయపడబోమని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బఖర్ ఖలీబాఫ్ అన్నారు. అమెరికా చర్యల వల్ల పెరిగే ఇంధన ధరలను చూసి త్వరలో అమెరికన్లు బాధపడతారని ఆయన ఎద్దేవా చేశారు.
ఇస్లామాబాద్లో 21 గంటల పాటు జరిగిన చర్చలు విఫలమవడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒప్పందం ఖరారయ్యే దశలో అమెరికా కొత్త డిమాండ్లు తెరపైకి తెచ్చిందని ఇరాన్ ఆరోపించగా, ఒప్పందం కుదరకపోవడం ఇరాన్కే ఎక్కువ నష్టమని అమెరికా పేర్కొంది. యురేనియం శుద్ధి, హమాస్ వంటి సంస్థలకు మద్దతు ఉపసంహరణ వంటి అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు.
ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధర బ్యారెల్కు 100 డాలర్లు దాటింది. రెండు వారాల కాల్పుల విరమణ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది.
అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ప్రకారం, ఈ దిగ్బంధనం సోమవారం ఉదయం 10 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30) అమల్లోకి వస్తుంది. ఇరాన్ పోర్టులను ఉపయోగించుకునే అన్ని దేశాల నౌకలకు ఇది వర్తిస్తుందని సెంట్కామ్ స్పష్టం చేసింది. అయితే, ఇరానేతర పోర్టులకు వెళ్లే నౌకల రాకపోకలకు మాత్రం ఎలాంటి అంతరాయం ఉండదని, స్వేచ్ఛా నౌకాయానానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.
సోషల్ మీడియాలో ట్రంప్ తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్కు "అక్రమ టోల్" చెల్లించే ఏ నౌకనైనా అంతర్జాతీయ జలాల్లో అడ్డగిస్తామని స్పష్టం చేశారు. "అమెరికా లేదా ఇతర శాంతియుత నౌకలపై ఇరాన్ దాడికి పాల్పడితే వారిని నరకానికి పంపుతాం" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ అమర్చినట్లు ఆరోపిస్తున్న మైన్లను కూడా తొలగిస్తామని తెలిపారు.
అమెరికా చర్యలపై ఇరాన్ కూడా అంతే తీవ్రంగా స్పందించింది. ట్రంప్ బెదిరింపులకు భయపడబోమని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బఖర్ ఖలీబాఫ్ అన్నారు. అమెరికా చర్యల వల్ల పెరిగే ఇంధన ధరలను చూసి త్వరలో అమెరికన్లు బాధపడతారని ఆయన ఎద్దేవా చేశారు.
ఇస్లామాబాద్లో 21 గంటల పాటు జరిగిన చర్చలు విఫలమవడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒప్పందం ఖరారయ్యే దశలో అమెరికా కొత్త డిమాండ్లు తెరపైకి తెచ్చిందని ఇరాన్ ఆరోపించగా, ఒప్పందం కుదరకపోవడం ఇరాన్కే ఎక్కువ నష్టమని అమెరికా పేర్కొంది. యురేనియం శుద్ధి, హమాస్ వంటి సంస్థలకు మద్దతు ఉపసంహరణ వంటి అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు.
ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధర బ్యారెల్కు 100 డాలర్లు దాటింది. రెండు వారాల కాల్పుల విరమణ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది.