కృష్ణలంకలో అమానుషం.. పబ్లిక్ టాయిలెట్లో పసికందును వదిలివెళ్లిన మహిళ
విజయవాడలో ఓ అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది. కన్నపేగు బంధాన్ని మరిచిన ఓ మహిళ, ముక్కుపచ్చలారని పసిబిడ్డను పబ్లిక్ టాయిలెట్లో వదిలి వెళ్లిపోయింది. నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా అందరినీ కలిచివేసింది.
వివరాల్లోకి వెళితే... కృష్ణలంకలోని పబ్లిక్ టాయిలెట్కు ఓ మహిళ తన బిడ్డతో వచ్చింది. లోపలికి వెళ్లాక, పాపను కింద పడుకోబెట్టి, ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ఓ బకెట్ను అడ్డుగా పెట్టి అక్కడి నుంచి పరారైంది. కాసేపటి తర్వాత టాయిలెట్ను శుభ్రం చేసేందుకు వెళ్లిన శానిటరీ సిబ్బంది పాప ఏడుపు విని చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు పసికందును వైద్యం కోసం పాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహిళ ప్రయాణించిన ఆటోను గుర్తించి, డ్రైవర్ను విచారించారు. ఆమె ఆటోలో వచ్చి, పాపను వదిలేశాక నేరుగా రైల్వేస్టేషన్కు వెళ్లి ఓ రైలు ఎక్కి పారిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఆ మహిళ ఎవరు? ఆమె సొంత బిడ్డేనా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
వివరాల్లోకి వెళితే... కృష్ణలంకలోని పబ్లిక్ టాయిలెట్కు ఓ మహిళ తన బిడ్డతో వచ్చింది. లోపలికి వెళ్లాక, పాపను కింద పడుకోబెట్టి, ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ఓ బకెట్ను అడ్డుగా పెట్టి అక్కడి నుంచి పరారైంది. కాసేపటి తర్వాత టాయిలెట్ను శుభ్రం చేసేందుకు వెళ్లిన శానిటరీ సిబ్బంది పాప ఏడుపు విని చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు పసికందును వైద్యం కోసం పాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహిళ ప్రయాణించిన ఆటోను గుర్తించి, డ్రైవర్ను విచారించారు. ఆమె ఆటోలో వచ్చి, పాపను వదిలేశాక నేరుగా రైల్వేస్టేషన్కు వెళ్లి ఓ రైలు ఎక్కి పారిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఆ మహిళ ఎవరు? ఆమె సొంత బిడ్డేనా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.