చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ బృందం భేటీ... అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు

 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా మారనుందని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. బుధవారం నాడు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన ప్రపంచ బ్యాంక్ బృందం.. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ప్రశంసలు కురిపించింది.

అమరావతిలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఐటీ, విద్యుత్ రంగాల్లో చేపట్టిన సంస్కరణలు అంతర్జాతీయంగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తాయని ప్రతినిధి బృందం పేర్కొంది. ఈ అభివృద్ధి కారణంగా అమరావతి భవిష్యత్తులో వాణిజ్య కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

ప్రపంచ బ్యాంక్ బృందం అభిప్రాయాలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, తమ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడంతో పాటు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అమరావతి ఒక చోదక శక్తిగా ఉపయోగపడుతుందని సీఎం వివరించారు.

Chandrababu Naidu
Amaravati
World Bank
Andhra Pradesh
AP Capital
Infrastructure Development
Investments
Economic Growth
IT Sector
Power Sector

More Telugu News