Chandrababu Naidu: మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భాంతి .. కీలక ఆదేశాల జారీ

Chandrababu Naidu Expresses Grief Over Markapuram Bus Accident Issues Orders
షార్ట్స్‌లో చూడండి
ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈరోజు తెల్లవారుజామున రాయవరం గ్రామ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఘటన తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులకు సూచించారు.
 
Go Back to Shorts
Chandrababu Naidu
Markapuram bus accident
Prakasam district
Andhra Pradesh road accident
Bus fire accident
Road accident casualties
Accident investigation
Andhra Pradesh government
Rayavaram
Private travels bus

More Telugu News