ఇక పైప్డ్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో ఎల్పీజీకి బదులుగా పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు (పీఎన్జీ) వాడకాన్ని ప్రోత్సహించేందుకు కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. త్వరలోనే దీనిపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పట్టణాల్లోని వినియోగదారులను ఎల్పీజీ నుంచి పీఎన్జీ వైపు మళ్లిస్తామని తెలిపారు.
వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని, రెస్టారెంట్లు, విద్యాసంస్థలకు సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. పట్టణాల్లో ప్రజలు పైప్డ్ గ్యాస్ కోసం నమోదు చేసుకోవచ్చని చెప్పారు. సోలార్, ఇండక్షన్ స్టవ్ లను వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు జరగకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అక్రమాలపై 800 కేసులు నమోదు చేసి 3,540 సిలిండర్లను సీజ్ చేసినట్లు చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని, ప్రజలు సోషల్ మీడియా వదంతులను నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు.
వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని, రెస్టారెంట్లు, విద్యాసంస్థలకు సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. పట్టణాల్లో ప్రజలు పైప్డ్ గ్యాస్ కోసం నమోదు చేసుకోవచ్చని చెప్పారు. సోలార్, ఇండక్షన్ స్టవ్ లను వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు జరగకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అక్రమాలపై 800 కేసులు నమోదు చేసి 3,540 సిలిండర్లను సీజ్ చేసినట్లు చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని, ప్రజలు సోషల్ మీడియా వదంతులను నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు.