Srikakulam district: శ్రీకాకుళం జిల్లాలో ఒక కుటుంబంపై సామాజిక బహిష్కరణ

Social boycott of family sparks outrage in Srikakulam district
షార్ట్స్‌లో చూడండి

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొండములగాం గ్రామంలో ఒక కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. నాగరిక సమాజంలో ఇంకా ఇలాంటి వెలివేతలు కొనసాగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూ వివాదం నేపథ్యంలో ఒక కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేస్తున్నట్లు గ్రామ పెద్దలు, గ్రామస్తులు కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం కలకలం రేపింది. 


సదరు కుటుంబం తమ భూమికి సంబంధించిన రికార్డులను రెవెన్యూ శాఖలో తారుమారు చేసిందని, ఈ విషయంలో గ్రామ పెద్దలు పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారు పెడచెవిన పెట్టడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ మేరకు గ్రామంలో దండోరా వేయించి, ఆ కుటుంబ సభ్యులను ఎటువంటి పనులకు పిలవకూడదని, శుభకార్యాలకు ఆహ్వానించవద్దని ఆంక్షలు విధించారు.


ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించారు. సామాజిక బహిష్కరణ అనేది చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు త్వరలోనే అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు. భూ వివాదాలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలి తప్ప, ఇలా అమానవీయంగా వెలివేతలకు పాల్పడటం రాజ్యాంగ విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు.

Go Back to Shorts
Srikakulam district
social boycott
Kondamulagam village
Ranastalam
land dispute
village elders
Andhra Pradesh
revenue department
police investigation

More Telugu News