లారీని ఢీకొట్టిన కారు.. చిత్తూరు జిల్లాలో భార్యాభర్తలు దుర్మరణం

జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైరెడ్డిపల్లి మండలం కప్పల్లె వద్ద ఆదివారం తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. పోలీసుల కథనం ప్రకారం, వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులోని వస్తువులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మృతులను అనంతపురం జిల్లాకు చెందిన దంపతులుగా గుర్తించారు. వారు తమ పనుల మీద వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తులోకి జారడమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


More Telugu News